వ్యక్తి మరియు సమాజంపై పాప ప్రభావం

మనం చేస్తున్నది మంచా, చెడా? మనం మంచి వ్యక్తులమా, చెడ్డ వ్యక్తులమా? అన్నది మన అంతరాత్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. కాబట్టి ఒకరి దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మన కు సంబంధించిన విషయం కాకపోవచ్చు కానీ, మన దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మాత్రం పూర్తిగా మనకు సంబంధించిన విషయం.

మనం చేస్తున్నది మంచా, చెడా? మనం మంచి వ్యక్తులమా, చెడ్డ వ్యక్తులమా? అన్నది మన అంతరాత్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. కాబట్టి ఒకరి దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మన కు సంబంధించిన విషయం కాకపోవచ్చు కానీ, మన దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మాత్రం పూర్తిగా మనకు సంబంధించిన విషయం.

బుద్ధి చేసే బోధనలకు బానిసయి మనిషి, అల్లాహ్‌ మార్గానికి దూరమైపోతాడు. మనసు కోరిన కోరికల మేరకు తన జీవన పథాన్ని నిర్మించుకుంటాడు. సత్యం, సదాచారాం, సత్కార్యాలు అతని చూపుకు ఆనవు. వీటికి బదులు స్వార్థం, స్వలాభం, స్వప్రయోజనాలు ప్రాధాన్యత వహిస్తాయి. అతను తన మనో కాంక్షలనే తనకు అవసరయోగ్యమయినవిగా భావిస్తాడు. మరో విధంగా చెప్పాలంటే, తన కాంక్షలనే దైవంగా చేసుకుంటాడు. మనిషి ఈ మనో స్థితిని ఇలా అద్దం పట్టి చూపిస్తు ంది ఖుర్‌ఆన్‌: ”నీవు ఎప్పుడయినా ఆ వ్యక్తి పరిస్థితిని గమనించావా-తన మనోకాంక్షల నే తన దైవంగా చేసుకున్నవాడిని?”. (ఫుర్‌ఖాన్‌: 43)

దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా ఉపదేశిం చారు: ”స్వర్గం మనసుకి రుచించని విషయాలతో కప్పబడి ఉంది. నరకం మనోభిరామ కాంక్షలతో కప్పబడి ఉంది”. (ముత్తఫఖున్‌ అలైహి)

సజ్జన పాఠకుల్లారా! సృష్టిలోని సమస్తమూ శోభతో, సువ్యవస్థతో, సామరస్యంతో వ్యవహ రిస్తోందంటే, అంతా ఒకే సృష్టికర్త, ఒకే ప్రభువు, ఒకే నిర్వహణకర్త అయిన అల్లాహ్‌ ప్రచండ అధికారానికి తల ఒగ్గినందుకే. సర్వం ఆయన దాస్యంలో స్వయం సమర్పణ చేసుకోవడం మూలానే ప్రకృతి వ్యవస్థలో ఈ సమన్వయం, సామరస్యం, ఏకత్వంలో భిన్న త్వం, భిన్నత్వంలో ఏకత్వం సాధ్యమయింది.  ప్రపంచ వ్యవస్థలోనూ నెమ్మది, శాంతి, తృప్తి నెలకొనాలంటే, మనం సయితం ఆ ఒక్క నిజ ఆరాధ్యునికే తల వంచాలి. ఆయన విధేయు లమయి జీవించాలి. అదే ప్రకృతిలో సామ రస్యం పొందగల మార్గం. అదే ప్రకృతి అను సరించే విధానం. అదే విశ్వమంతటా విస్తరిం చిన వాస్తవం. ఒక్క మాటలో చెప్పాలంటే, విధేయత, సత్కర్మ మనిషిని ఇహపరాల్లో సాఫల్య బాటన విజయవంతంగా నడిపిస్తే, అవిధేయత, పాపం, దుష్కర్మ మనిషిని ఇహ పరాల్లో పరాభావానికి, అధోగతికి గురి చేసి అపకీర్తి పాలు చేస్తుంది.

‘పాపం, అవిధేయత అనేది పుణ్యం, విధేయ తకు విరుద్ధమయినది. షరీయతు పరిభాషలో -పాపం, అవిధేయత అంటే, అల్లాహ్‌ ఆదేశించిన, ఆయన ప్రవక్తలు ప్రబోధించిన, ఆయన గ్రంథాలు ఉపదేశించిన అంశాలను విడ నాడటం, వ్యతిరేకించడం’ అన్నారు అల్లామా ఇబ్ను తైమియా (ర).   ఖుర్‌ఆన్‌ హదీసుల్లో అవిదేయత అనేక అర్థాల్లో వాడబడింది. పాపం, తప్పు, చెడు, అనైతికత, అశ్లీత, అసభ్యత, అవినీతి, అక్రమం, అన్యాయం, దౌర్జన్యం, దుర్మార్గం, అపమార్గం, అసత్యం, అలజడి, అల్లకల్లోలం,నీచత్వం, లోభం,వ్యామోహం, మదం, మత్సర్యం, విధ్వం సం, అత్యాచారం, హద్దు మీరడం, మూర్ఘత్వం, మంకుతనం, ఉప ద్రవం, హత్య..మొదలయిన అర్థాల్లో చెప్పబడింది.

సజ్జన పాఠకుల్లారా! నేడు ఎటు చూసినా, అశాంతి, అలజడి, అశ్లీ లం, అనైతికం, అమానవీయం, అక్రమం, అన్యాయం విలయతాం డవం చేస్తున్నాయి. కోట్లకు పడగలెత్తిన కుబేరులు మొదలు కూటికి గతిలేని ఆమ్‌ ఆద్మీ వరకు ఈ సామాజిక రుగ్మతల వాతన పడిన వారే. కారణం, అల్లహ్‌ ఆదేశాల పట్ల అశ్రద్ధ, అలక్ష్యం, అవిధేయ తలే. ఖుర్‌ఆన్‌ ఇలా హెచ్చరిస్తుంది: ”ఎవరయితే అల్లాహ్‌కు, మరియు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతారో వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనయినట్లే జాగ్రత్త!”. (అహ్జాబ్‌:36)

”ఎవడు అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స) యెడల అవిధేయుడయి ఆయన నిర్ధారించిన హద్దులను మీరిపోతాడో వాడ్ని నరకాగ్నిలో పడ వేస్తాడు. వాడందులో కలకాలం పడి ఉంటాడు. అవమానకరమ యిన శిక్ష అలాంటి వారి కోసమే ఉంది”.

దీనికి భిన్నంగా – ”అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త (స)కు విధే యత చూపేవారికి అల్లాహ్‌, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల లో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే”. (నిసా: 13) కాబట్టి పాపం అది చిన్నదయినా, పెద్దదయినా మనం మాత్రం దానికి దూరంగా మసులుకోవాలి.

పాపాలు అనేవి కబీరా-పెద్దవి, సగీరా-చిన్నవి అన్న రెండు భాగాలు గా ఉన్నప్పటికీ, తప్పు అని తెలిసి కూడా మంకుతనం మానక నిశ్శం కోచంగా పాల్పడే ఏ చిన్న పాపం చిన్నదిగా ఉండదు. అలాగే పశ్చా త్తాపం చెంది, తౌబా చేసుకున్న తర్వాత ఏ పెద్ద పాపం పెద్ద పాపంగా మిగులదు అన్నారు పండితులు. అలాగే పాపాలను మూడు శ్రేణుల్లో విభజించారు ఇబ్ను తైమియా (ర).

1) ప్రజలపై చేసే దౌర్జన్యం: అన్యాయంగా ఒకరి ఆస్తికి హక్కుదారులై కూర్చోవడం. ఒకరికి దక్కాల్సిన హక్కుల్ని కాలరాయడం. ఒకరికి ప్రాప్తమయి ఉన్న అనుగ్రహాలను చూసి ఓర్వలేనితనంతో కుతకుత లాడటం.

2) ఆత్మపై దౌర్జన్యం: మద్యం, మాదకద్రవ్యాల సేవనం, వ్యభిచారం.. వగైరా.

3) రెండూ కలగలసిన దౌర్జన్యం: అక్రమార్జనతో మాదకద్రవ్యాల సేవనం. అధర్మ ఆస్తితో మగువ లోలత్వానికి బానిస్వడం వగైరా.

ఈ పాపాలనే మరో రకంగా కూడా విభజించవచ్చు.

1) విశ్వాస పరమైన పాపాపలు: షిర్క్‌-బహుదైవారాధన, కాపట్యం, ప్రదర్శనాబుద్ది వగైరా…

2) నైతిక పరమైన పాపాలు: మద్యపానం, వ్యభిచారం, వగైరా..

3) ఆరాధనల పరమైన పాపాలు: నమాజుకు వెళ్ళక పోవడం, జకాత్‌ చెల్లించకపోవడం వగైరా…

4) ప్రవర్తనా పరమైన పాపాలు: వాగ్దాన భంగం, దొంగతనం, దోపిడి, లంచం, వడ్డీ వగైరా…పోతే పాప ప్రభావ విషయానికొస్తే అది రెండు విధాలు – వ్యక్తిపరమైనది, సామాజికపరమైనది.

వ్యక్తిపరమైనది -హృదయాలకు తుప్పు పడుతుంది:

దైవప్రవక్త (స) అన్నారు: ”ఏ హృదయంలోనయితే అల్లాహ్‌ా స్మరణ ఉంటుందోఅది సుబిక్ష హృదయం.మరే మనస్సులోనయితే అల్లాహ్‌ స్మరణ ఉండదో అది దుర్బిక్షమయిన హృదయం-పాడుబడిన బంగళా వంటిది” అని. మరో సందర్భంలో ఆయన హృదయం వైపు సైగ చేస్తూ ”దైవభీతి ఇక్కడుంటుంది” అని అన్నారు.

ఏ హృదయం అయితే అల్లాహ్‌ ఘనతా ఔన్నత్యాలకు ఆలయ మయి ఉంటుందో, మరే హృదయంలోనైతే అల్లాహ్‌ పట్ల భక్తిప్రప త్తులు ఉప్పొంగుతాయో, అల్లాహ్‌ భీతితో కంపించిపోతుందో ఆ హృదయానికి అల్లాహ్‌ అన్నా, అల్లాహ్‌ ఆదేశాలన్నా, ఆయన ప్రవక్త లన్నా, వారి ప్రబోధనాలన్నా, ఆయన గ్రంథాలన్నా, వాటి ప్రవచ నాలన్నా వల్లమాలిన అభిమానం, గౌరవం ఉంటుంది. ఫలితంగా అలాంటి హృదయం కలిగిన వ్యక్తుల జీవితాలు ప్రశాంతంగా, వారి మనో సీమలు ప్రకాశమానంగా ఉంటాయి.

మరెవరి గుండెల్లోనయితే అల్లాహ్‌ భయం, భక్తి సన్నగిల్లుతుందో అట్టి గుండెల్లో గుబులు అనే గుబురు పొదలు పేరుకుపోతాయి. అవి అదే స్థాయి ఏమరుపాటుకి గురవుతాయి. దీని గురించి వివ రిస్తూ దైవప్రవక్త (స) ఇలా విశదపర్చారు: ”దాసుడు ఒక మంచి కార్యం చేస్తే అతని హృదయ ఫలకంపై ఒక తెల్లని మచ్చ ఏర్పడు తుంది. ఆ సత్క్రియ క్రమాన్ని అతను అలానే కొనసాగిస్తే మొత్తం హృదయం కాంతిమయమైపోతుంది. అదే అతను పాపం చేస్తే అతని మనోఫలకంపై ఒక నల్లని మచ్చ ఏర్పడుతుంది.ఆ దుష్క్రియ క్రమాన్ని అతను గనక కొనసాగిస్తే అది పెరిగి మొత్తం హృదయం చీకటిమయం అయిపోతుంది. దాన్నే ‘రైన్‌-తుప్పు’ అంటారు. దాని గురించే ఖుర్‌ఆన్‌ ఈ విధంగా పేర్కొంది: ”అసలు విషయమేమి టంటే, వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పు పట్టింది”.  (ముతఫ్ఫిఫీన్‌: 14)

మరో చోట ఇలా సెలవియ్యబడింది: ”(వారి) చర్మచక్షువులకు అంధత్వం లేదు. వారి హృదయాలకు ఉన్న ఆత్మచక్షువులకే అంధ త్వం ఆవహించింది”. (హజ్జ్‌:46)

ఫలితంగా వారు పంచేంద్రియాలు, జ్ఞానేంద్రయాలు ఉండి కూడా సత్యాన్ని గ్రహించే శక్తిని కోల్పోతారు. ఇక ఎవరి హృదయ కవా టాలు మూసుకుపోతాయో అతని అవయవాలన్నీ ఎన్ని సత్యాలు చూసినా, విన్నా స్పదించవు. ఆ ఆత్మచక్షువుల అంధత్వం వారి వద నాలపై, వారి ఆలోచనపై, వారి ప్రతిపాదనలపై, వారి నడకలపై, నడవడికలపై కొట్టుకొచ్చినట్లు కనబడుతుంది.  హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ అబ్బాస్‌ (ర) ఇలా అభివిర్ణించారు: ”సత్కర్మ ఫలితంగా మనిషి వదనం కాంతులీనుతోంది. హృదయం జ్యోతీర్మయం అవుతోంది. ఉపాధిలో సమృద్ధి శుభాలు ఒనగూడుతాయి. శరీరంలో శక్తి చోటు చేసుకుంటుంది. సృష్టిచరాచరాల గుండెల్లో ఆ వ్యక్తి కోసం ప్రేమాభి మానాలు పెల్లుబుకుతాయి. ఇది సత్కర్మ ప్రభావమయితే, దుష్కర్మకు పాల్పడే వ్యక్తి వదనం దుమ్ముకొట్టుకొని కళాహీనమయి ఉంటుంది. హృదయంలో చీకట్లు రాజ్యమేలుతాయి. శరీరంలో సత్తువ నశి స్తుంది. ఉపాధిలో శుభం లేకుండా పోతుంది. సృష్టిరాసుల మనస్సు లో ఆ వ్యక్తి పట్ల ద్వేషభావన, ఏహ్యభావన నిండి పోతుంది.

ఓ సందర్భం ఒక వ్యక్తి ‘మంచీచెడులను ఎలా అంచనా కట్టాలి?’ అని మహనీయ ముహమ్మద్‌ (స) వారిని అడిగాడు. దానికి బదులి స్తూ ఆయన-”ఓ పని చేస్తూ నీకు అంతరంగికంగా ఆత్మానందం కలిగిందంటే అది మంచి అని తెలుసుకో. ఒక పని చేస్తూ నీ ఆంత ర్యంలో శంక కలిగి, ప్రజలు ఎక్కడ చూస్తారేమో అన్న భయం ఏర్ప డితే మాత్రం అది చెడు అని గుర్తుంచుకో!” అని అన్నారు ప్రవక్త (స).

మనం చేస్తున్నది మంచా, చెడా? మనం మంచి వ్యక్తులమా, చెడ్డ వ్యక్తులమా? అన్నది మన అంతరాత్మకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. కాబట్టి ఒకరి దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మన కు సంబంధించిన విషయం కాకపోవచ్చు కానీ, మన దృష్టిలో మనం ఎలాంటి వారం అన్నది మాత్రం పూర్తిగా మనకు సంబంధిం చిన విషయం. అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు: ”నిశ్చయంగా ఆత్మ ప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు. అంతరాత్మ ఘోషను అణచి పెట్టినవాడు నాశనమవుతాడు”. (షమ్స్‌:8,9)

ఇక ఎవరయితే తమ అంతరాత్మ గొంతును నిర్ధాక్షిణ్యంగా నులిమి వేశారో, ఎవరి మనో సీమలయితే దానవత్వానికి దగ్గరగా దాన గుణానికి దూరంగా తయారయ్యాయో వారు చెడును మంచిగా, మంచిని చెడుగా, నాగరికతను అనాగరికతగా, ఆటవికాన్ని ఆధు నికంగా చూస్తారు. ఫలితంగా అంతిమ శ్వాస ఆగే అంతిమ ఘడి యల్లో ‘కలిమా-లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’కు సయితం నోచుకోకుండా చెడ్డ చావు చస్తారు

Related Post