ఈ రోగ కారకాలను ప్రజా జీవితాల నుండి ఏరివేయాలి

ఈ రోగ కారకాలను ప్రజా జీవితాల నుండి ఏరివేయాలి

ముహమ్మద్ అజీజుర్రహ్మాన్

స్వలింగ సంపర్కానికి చట్టబద్ధతను కల్పిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు నూరు కోట్ల మంది భారతీయులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే అనాదిగా భారత దేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా పరిఢవిల్లింది. మన పూర్వీకులు విలువలకు కట్టుబడినవారు. మానమ ర్యాదలకు పట్టం కట్టినవారు. గాంధీజీ సహా భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రథమ శ్రేణి నాయకులుగానీ, రుషులుగానీ, పుణ్య పురుషులు గానీ స్వలింగ సంపర్కం లాంటి ముదనష్టపు చేష్టలకు స్వతంత్ర భారతంలో మాన్యత లభిస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి కర్మ భూమిలో నేడు గుండె తరుక్కుపోయే అనూహ్య సంఘటనలు సంభవించటం కడు శోచనీయం.

స్వలింగ సంపర్కం ఒక అసహజమైన, ప్రకృతికి విరుద్ధమైన చేష్ట. ఇది నీతి బాహ్యతకు పరాకాష్ఠ! జంతువులు సయితం ఆసక్తి కనబరచని ఈ పాడు పనికి ఒడిగట్టడం సృష్టిశ్రేష్ఠుడైన మానవుడికే చెల్లింది. సహజసిద్ధమైన లైంగిక వాంఛల పరిపూర్తికై ఒక మగవాడు ఒక ఆడదాన్ని ఆశించటం ప్రకృతి. అయితే ఈ ప్రకృతి కాస్తా వికటించి వికృతిగా మారి, దుష్ఫలితాలు చవి చూసిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. పురుషుడు స్త్రీని కాదని, పురుషునితోనే రమించి, లైంగిక తృప్తి నొందే అసహజ చేష్టకు సహస్రాబ్దుల క్రితం శ్రీకారం చుట్టి, అపఖ్యాతిని మూటగట్టుకున్న తొట్టతొలి జనులు లూత్‌ జాతి జనులు. తన జాతివారిలో ప్రబలిన ఈ పాపిష్టి పోకడపై దైవప్రవక్త బాధతో కుమిలిపోయేవారు. కలత చెందిన మనసుతో, ”అయ్యో! మీరు మరీ ఇంత లజ్జా విహీనులుగా ప్రవర్తిస్తున్నారేమిటి? మీ కోసం పరిశుద్ధలైన నా (జాతి) కూతుళ్ళుండగా, వారిని వదిలేసి మీరు మగవాళ్ళ వెంట పడ్డారేమిటి? మీరు కాస్త దైవానికి భయపడండి” అని లూత్‌ (అలైహిస్సలాం) తన జాతి ప్రజలను ప్రాధేయపడ్డారు. కాని ఆవేదనాభరితమైన ఆ పిలుపు వాళ్ల ముందు బధిర శంఖారావమే అయింది. ఎట్టకేలకు ప్రకృతి ప్రకోపించింది. దైవాగ్రహం వాళ్ళపై విరుచుకుపడింది. పశ్చిమాసియాలో మృత సముద్ర తీరాన నివసించే ఆ బస్తీ వాసులంతా భావితరాలకు ఒక గుణపాఠ సూచనగా మిగిలిపోయారు. నేడు శ్మశాన రాజ్యంగా మారివున్న ఆ జనవాసాల్లో ఒకటైన ‘సదూమ్‌’ పేరుతోనే (బహుశా) నేటి స్వలింగ సంపర్కులు ‘సోడోమ్‌’లుగా వ్యవహరించబడుతున్నారు.

పాశ్చాత్య దేశాలైన బ్రిటన్‌, అమెరికాలలో చాలా కాలంగా ఈ జాడ్యానికి చట్ట భద్రత ఉంది. ఆఖరికి అక్కడి చట్ట సభల్లో సయితం తమకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని ఉద్యమించే దాకా పోయారు ఈ సోడోమ్‌లు. పాశ్చాత్యులను అనుకరించే మిగతా ప్రపంచంపై కూడా ఈ ప్రభావం పడింది. నేడు ప్రపంచంలో సగానికంటే ఎక్కువ రాజ్యాలే ఈ రంఢ్వాతనాన్ని నేరంగా పరిగణించటం లేదంటే పరిస్థితి ఎంతగా విషమించిందో ఊహించవచ్చు. మన దేశంలో సయితం గత థాబ్ది కాలంగా ఈ వెర్రిని ప్రమోట్‌ చేసే సినిమాలు నిర్మించబడ్డాయి. తమకు విచ్చలవిడిగా రమించే హక్కు ఇవ్వాలని మూడేండ్ల క్రితం ఈ జుట్టు పోలిగాళ్ళు ఢిల్లీ వీధుల్లో ప్రదర్శనలు జరిపిన వైనాన్ని మరవలేము. ఇప్పుడు ఆ ‘గే’ల విజ్ఞప్తిపై ఏకంగా హైకోర్టు హోమో సెక్సువాలిటీని ప్రాధమిక హక్కుల కోవకు చెందిన అంశంగా ఖరారు చేసింది.

Related Post