స్వేచ్ఛ మరియు ఇస్లాం

 ''ఫ్రీడమ్‌ ఈజ్‌ రెస్పాన్సిబిలిటి'' అంటుంది ఇస్లాం. ఇస్లాం వ్యక్తిపై కొన్ని ఆంక్షల్ని విధించడానికి కారణం అతను తనకివ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి తన స్వయానికి, కుటుం బానికి, సమాజానికి ఎలాిం హాని కలుగజెయ్యకుండా ఆనంద మకరం దాన్ని గ్రోల గలగాలన్నదే!

”ఫ్రీడమ్‌ ఈజ్‌ రెస్పాన్సిబిలిటి” అంటుంది ఇస్లాం. ఇస్లాం వ్యక్తిపై కొన్ని ఆంక్షల్ని విధించడానికి కారణం అతను తనకివ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి తన స్వయానికి, కుటుం బానికి, సమాజానికి ఎలాిం హాని కలుగజెయ్యకుండా ఆనంద మకరం దాన్ని గ్రోల గలగాలన్నదే!

స్వేచ్ఛ-స్వాతంత్య్రాన్ని ప్రతి ఒక్కరు కాక్షింస్తారు. బానిసత్వం, గులామ్‌గిరీని ఏ ఒక్కరూ ఇష్ట పడరు. మనిషికి కావాల్సిన ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక, సాంస్కృతిక స్వాతంత్య్రం-స్వేచ్ఛ లేని చోట అతను మనజాలడు, మనుగడను సవ్యంగా కొనసాగించలేడు. తన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఒకరు ప్రశించ డాన్ని మనిషి సుతరామూ ఇష్టపడడు. మనిషిలో ఈ సహజ భావాన్ని ఇస్లాం గౌరవిస్తుంది. ఇస్లాం మనిషి నైజాన్ని మార్చడానికి ఆవిర్భవించ లేదు, దాన్ని సంస్కరించడానికి అది వచ్చి.ంది. మంచీచెడులను విడమరచి చెప్పడంతో పాటే, అంగీకరించే, తిరస్కరించే పూర్తి స్వేచ్ఛాధికారాలను అతనికి ఇస్తుంది:

”నిశ్చయంగా మేము మానివుణ్ణి పరిక్షించడానికి ఒక మిశ్రమ వీర్య బిందువు తో ప్టుించాము. మరి మేము అతన్ని వినేవాడుగా, చూసేవాడుగా చేెశాము. నిశ్చయంగా మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక అతను కృతజ్ఞుడుగా వ్యవహరించినా లేక కృతఘ్నతకు పాల్పడినా ఆ స్వేచ్ఛ అతనికుంటుంది. నిశ్చయంగా తిరస్కారుల (స్వేచ్చను దుర్వినియోగ పరచిన వారి) కోసం మేము సంకెళ్ళను, ఇనుప ప్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉం చాము. దీనికి భిన్నంగా సజ్జనులు (స్వేచ్చను సద్వినియోగ పర్చుకున్న వారు) ‘కాఫూర్‌’ కలుపబడిన మధు పాత్రలను సేవిస్తారు”. (అద్‌ దహ్ర్‌:2,3)
మరియు ఇలా అను: ”అసాంతం సత్యం (తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్‌) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు. కోరినవారు నిరాకరించవచ్చు”. (అల్‌ కహఫ్‌: 29)

దేవుడు మనిషిని వినేవాడుగా, చూసేవాడు, బుద్ధికుశలతలు గలవాడిగా చేయడమే కాక అతని మార్గదర్శనార్థం 1లక్ష 24వేల మంది ప్రవక్తల్ని ప్రభ వింపజేసి, అనేక గ్రంథాలను అవతరింపజేసి, అనేకానేక పుణ్యాత్ముల ద్వారా సత్యమేదో, అసత్యమేదో బోధ పరచి – దైవ విధేయతా మార్గాన్ని అవలంబిం చి ధన్యజీవిగా నెగ్గుకొస్తాడో లేక అపమార్గాన్ని అనుసరించి అప్రతిష్ట పాలవు తాడో అతని ఇష్టం అని చెప్పడంతోపాటు అతని చేష్టల వల్ల తర్వాత చోటు చేసుకునే పర్యవసానాల గురించి కూడా విశద పర్చాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా అన్నారు: ”ప్రతి వ్యక్తీ తన అంతరాత్మను క్రయావక్రయాలకై పెడతాడు. ఈ వర్తకంలో అతడు దాన్ని నాశనం అయినా చేస్తాడు లేదా దానికి స్వేచ్ఛనయినా ప్రసాదిస్తాడు”. (సహీహ్‌ ముస్లిం)
స్వేచ్ఛాసాంతత్య్రాల విలువ నిజంగా వాిని ఒకసారి పొంది కోల్పోయిన వ్యక్తికే బాగా తెలుస్తుంది. ఓ సందర్భంగా నాటి విశ్వాస భాందవుడొకడు ఈరాన్‌ రాజునుద్దేశించి చెప్పిన మాట గమనార్హం! ”ఇస్లాం వచ్చిందే మానవుల్ని సాటి మనుషుల దాస్య శృంఖలాల నుండి ముక్తిని ప్రసాదించి అనంత స్వేచ్ఛా వాయువుల్లో విహరింపజేయడానికి”. సత్యం శక్తి ఉన్నవారి పక్షాన ఉంటుంది అన్న భ్రాంతిని పాపంచలు చేసిన ధర్మం ఇస్లాం. సత్యమే స్వయంశక్తి. అది ఎవరి పక్షాన ఉంటే అతనే శక్తిమంతుడు. స్వాతం త్య్రం ప్రతి ఒక్కడి జన్మహక్కు అన్నది జగద్వితం, కఠోర సత్యం! ”మనిషి స్వేచ్ఛాపరునిగానయినా జీవించాలి లేదా స్వేచ్చ కోసం పోరాడుతూ అయినా మరణించాలి.ఇస్లాంలో రెండే మార్గాలు మూడో ప్రత్యామ్నయం లేదు” అన్నారు అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ (ర). (ఖౌల్‌ ఫైసల్‌: 63,64)

మనుషుల్ని సృష్టించిన దేవుడు మనిషికి చాలా వరకు స్వేచ్ఛాధికారాలను ప్రసాదించాడు. ఇష్టమయినది తినే, తొడిగే, ఇష్టమయిన చోటుకి వెళ్ళే, నచ్చిన పని చేసుకునే, నచ్చినది కొనుక్కునే, ఆర్థిక, వైజ్ఞానిక రంగాల్లో అభి వృద్ధిని సాధించుకునే, నచ్చిన నారీమణిని మనువాడుకునే స్వేచ్ఛను అల్లాహ్‌ అతనికి ప్రసాదించాడు. ఈ విధమయినటువిం స్వేచ్ఛలో స్త్రీపురుషులిరు వురూ సమానులే. ఈ కారణంగానే ఒక స్త్రీని మనువాడాలంటే ఆమె అను మతి తప్పనిసరి అంటుంది ఇస్లాం. ఇస్లాం మనిషికి స్చేచ్ఛనయితే ఇచ్చింది కానీ బాధ్యతారహిత స్వేచ్ఛను ఇవ్వలేదు. ”ఫ్రీడమ్‌ ఈజ్‌ రెస్పాన్సిబిలిటి” అంటుంది ఇస్లాం. ఇస్లాం వ్యక్తిపై కొన్ని ఆంక్షల్ని విధించడానికి కారణం అతను తనకివ్వబడిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి తన స్వయానికి, కుటుం బానికి, సమాజానికి ఎలాిం హాని కలుగజెయ్యకుండా ఆనంద మకరం దాన్ని గ్రోల గలగాలన్నదే! ముఖ్యంగా ముస్లింలు ఈ విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటుంది.

బాధ్యతారహిత స్వేచ్ఛ పిచ్చోడి చేతిలో రాయి అంటుంది. ”ఇహం, మనిషికివ్వ బడిన పరిమిత స్వేచ్ఛను దుర్వినియోగ పర్చేవారి కోసం స్వర్గంగానూ, సద్వినియోగ పర్చుకునే వారి కోసం చెర శాలగా (ఆంక్షలు కూడినదిగా)ను ఉంటుంది” (తిర్మిజీ) అంటుంది. ఆ విధంగా ఒక ముస్లింపై అనేక విధమయినటువిం ఆంక్షలు ఉంాయి. వాక్‌ స్వాతంత్య్రం పేర నేడు కొనసాగుతున్న అనైతికానికి, అధర్మానికి అతను బాసటగా నిలువడు. నోరు ఉంది కదా అని నోటికొచ్చింది వాగడు. ఒక మాట చెప్పక ముందు ఒకికి పది సార్లు ఆలోచించి మరీ చెబుతాడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఏదేని విషయంలో అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త తీర్పు చేసేస్తే విశ్వాసి అయిన స్త్రీపురుషులెవ్వరికి సొంత జోక్యం చేసుకునే అనుమతి లేదు”. (అహ్జాబ్‌: 36)

ఒకనాటి బానిస వ్యవస్థ:

నేటి మానవుడు, 21వ శతాబ్దిలో కూచోని, బానిసత్వపు సమస్యను పరిశీలించినప్పుడు, ఆ చరిత్రలో మనుషుల్ని వ్యాపార వస్తువులుగా, క్రయా విక్రయాలకు గురి చేసిన ఉదంతాలు కుప్పలుతెప్పలుగా కనబడతాయి. అలాిం తరుణంలో – ‘స్వాతంత్య్రం అన్నది ఎవరో దయదలిస్తే లభించే భిక్షం వింది కాదు. దాన్ని తమ బాహుబలంతో కృషించి సాధించ వలసి ఉంటుంది’ అని మానవ చరిత్రలో మొదిసారిగా బానిసత్వానికి వ్యతిరే కంగా గళం విప్పిన ఘనత ఇస్లాం ధర్మానిది. పూర్ణ స్థాయిలో ఇస్లాం ఆవిర్భావం తర్వాత బానిసల స్థితిలో వచ్చిన మార్పుకు పర్యవసానంగా వారు వ్యాపార వస్తువులుగా కాక మొది సారి పూర్తిగా మానవతా హక్కుల్ని, గౌరవాదరణలను పొందారు. ఇస్లాం కేవలం బానిసల విడుదల లేక విముక్తికి మాత్రమే కృషి చెయ్యలేదు. సకల మానవ స్వేచ్ఛా స్వాతం త్య్రాలకు సంబంధించిన సరయిన భావనను కూడా ప్రతిపాదించింది. ఆ భావనకనుగుణంగా ఆచరించి మరీ చూపింది. వారి విముక్తికై ఓ విలక్షణ మయిన ఉద్యమాన్ని మానవ నైజానికి అతి సమీపమయిన పంథాలో లేవ నెత్తింది.
ఈ లక్ష్యసిద్ధికి అది రెండు మార్గాలను అవలంబించింది. 1) అల్‌ ఇత్ఖ్‌ – యజమానుల తరఫున బానిసల స్వచ్ఛంద స్వేచ్ఛ. 2) ముకాతబత్‌ – యజ మానులూ బానిసల మధ్య స్వేచ్ఛకు సంబంధించన వ్రాతమూలకమయిన ఒప్పందం. ఖుర్‌ఆన్‌లో కొన్ని పాపకార్యాలకు ప్రాయశ్చితంగా బానిసల్ని విముక్తి కలిగించమని బోధించడం జరిగింది. పొరపాటున ఒక ముస్లింను చంపితే పరిహారంగా ఒక బానిసను విడుదల చెయ్యాలి. హతుని వారసుల కు రక్తపరిహారం చెల్లించాలి. (దివ్యఖుర్‌ఆన్‌-4: 92)
దైవప్రవక్త (స) కొన్ని అపరాధాలకు ప్రాయశ్చితంగా బానిసల్ని విముక్తి కలిగించమని బోధించారు. ”కొడుకు తండ్రి రుణాన్ని తీర్చలేడు, తండ్రిని బానిసత్వం నుండి విడుదల చేస్తే తప్ప” అని బానిస సమస్య తీవ్రతను విశద పర్చారు.
ఇస్లాం బానిసలకు స్వేచ్ఛను ప్రసాదించడమే కాదు సైన్యాధిపత్యాన్ని, జాతి నేతృత్వాన్ని, ఉన్నత పదవుల్ని ప్రసాదించింది. దైవప్రవక్త (స) అన్సార్ల, ముహాజిరీన్లలోని గొప్ప గొప్ప నాయకులతో కూడిన ఓ సైనిక బృందాన్ని తయారు చేసినప్పుడు దానికి బానిస జైద్‌ను అధినాయకునిగా నియమిం చారు. తండ్రి జైద్‌ మరణానంతరం ఆయన కొడుకు ఉసామా(ర)ను అబూ బకర్‌ (ర), ఉమర్‌ (ర) విం ఉద్దండులున్న సైన్యానికి సేనాధిపతిగా నియ మించారు. ఇస్లాం ఇచ్చిన శిక్షణ ఫలితమే – హజ్రత్‌ ఉమర్‌ తన తర్వాత ఖలీపాగా నియమించ వలసిన అవసరం ఏర్పడినప్పుడ ”అబూ హుజైఫా బానిస సాలిమ్‌ బ్రతికి ఉన్నట్లయితే నేను నా తర్వాత అతన్నే ఖలీఫాగా నియమించేవాణ్ణి” అన్నారు. ఇస్లాం ఒకవైపు స్వచ్ఛందంగా తమ బానిసల్ని విమోచనివ్వాలని ముస్లింలను ప్రేరేపించి, రెండోవైపు బానిసల మానసిక, నైతిక స్థాయిని పెంచేందుకు శ్రద్ధ వహించింది. ఎందుకంటే, బానిసల్ని మానిసికంగా స్వేచ్ఛా స్వాతంత్య్రాల కొరకు సమాయత్త పరచకుండానే కేవలం కొన్ని సద్భావాలపై ఒక చ్టాన్ని చేయడం ద్వారానో, ఒక ఆదేశాన్ని ప్రకించడం మూలంగానో శతాబ్దాల తరబడి వస్తున్న బానిసలు వారం తటవారే స్వయంగా విమోచన పొందలేరు. కాబ్టి వారిలో విమోచనా కాంక్షను జాగృతం చేసింది. స్వేచ్ఛ తెచ్చే బాధ్యతలను ఎదుర్కొనేలా వారిని సమాయత్త పరచింది. సొంతంగా శ్రమించి స్వేచ్ఛను పొందే అధికారాన్ని ముకాతబత్‌ రూపంలో వారికిచ్చింది. అంతే కాదు స్వేచ్ఛ కోరుకునే బానిస లకు ప్రభుత్వ ధనాగారం నుండి ధన సహాయం ఇస్తుంది. దీనికి బదులుగా ఎలాిం భౌతిక ప్రతిఫలాన్ని అది ఆశించదు. కేవలం విశ్వ ప్రభువు ఆదేశాలను పాలించి, ఆయన ప్రస్నతను పొందాలన్న ఒకే ఒక్క వాంఛ తప్ప. జకాతు ఫండును ఖర్చు చేసే పద్దుల్ని ప్రస్తావిస్తూ ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”నిశ్చయంగా జకాత్‌ నిరుపేదల కోసం, అగత్యపరుల కోసం …..ఇంకా బానిసల్ని విడుదల చేయించడానికి ఖర్చు చేయండి”. (దివ్య ఖుర్‌ఆన్‌-9: 60)

అసలు దాస్యం ఎవరికి చెయ్యాలి?

తన దాసులు తన దాస్యాన్ని తప్ప అన్య సృష్టితాల దాస్య సృంఖలాలలో బంధీలవ్వడం అల్లాహ్‌ాకు సుతరామూ ఇష్టం లేదు. ఆయన మనందరి సృష్టికర్త గనక మనందరిని తన దాసులుగా, తన దాస్యంలోనే శ్వాసించేవారిగా చూడా లనుకుాండు. ఎందుకంటే ఆయన ఈ విశ్వ బ్రహ్మాండాన్ని ప్టుించడమే కాదు, దాన్ని సంరక్షిస్తున్నాడు, దాని మంచీచెడులను గమనిస్తున్నాడు కూడా. సమస్తాన్ని జిన్నాతుల, మానవుల సేవ కోసం ప్టుించి జిన్నాతులను, మాన వులను మాత్రం తన సేవ కోసం ప్టుించాడు. ఒక్క సారి దాసుడు దేవుని దాస్య పరిధిలోకి ప్రవేశించాడంటే ప్రపంచలోని దాస్యసృంఖలాలన్నిం నుండి అతనికి సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలు ప్రాప్తిస్తాయి. ఆయన సమక్షంలో మనస్ఫూర్తిగా చేసే ఒక్క సజ్జా దరి దరిన తల వంచే తలవంపు చర్యల నుండి అతన్ని కాపాడుతుంది. మనిషి విశ్వంలో మహోత్కృష్టజీవి. అందమైన ఆకృతి గలవాడు, గౌరవోన్నతలు గలవాడు. సృష్టిశ్రేష్టుడయిన మనిషి తనకన్నా హీనమయిన సృష్టిరాసుల ముందు మోకరిల్లడానికి మించిన మూర్ఖత్వం మరొకి ఉండదు. హజ్రత్‌ రుబ్‌యీ బిన్‌ ఆమిర్‌ (ర) ఈరాన్‌ రాజు రుస్తుం ముందు అల్లాహ్‌ా సందేశాన్ని అందజేస్తూ అన్న మాట సువర్ణాకరాలతో లిఖిం చదగినది -”అల్లాహ్‌ తాను తలచిన తన దాసుల్ని దాసుల దాస్యం నుండి వెలికి తీసి అల్లాహ్‌ దాస్యం వైపునకు, ప్రాపంచిక ఇరుకు మనస్తత్వం నుండి దాని విశాలత వైపునకు, మతాల దౌర్జన్యం నుండి ఇస్లాం న్యాయం వైపునకు తీసుకెళ్ళడానికి మమ్మల్ని పంపాడు”.

ద్వితీయ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ (ర) గారి హయాంలో ఈజిప్టు గవర్నర్‌ అమ్ర్‌ బిన్‌ ఆస్‌ (ర) గారి కొడుకు అన్యాయంగా ఒక సామాన్య వ్యక్తి మీద చేయి చేసుకున్నాడు. అది తెలిసిన ఉమర్‌ (ర) ఇరువురినీ ఈజిప్టు నుండి మదీనా పట్టణానికి రప్పించి – ‘నువ్వు నా కళ్ళ ఎదుటే నిన్ను అతను ఎలా క్టొాడో అలానే కొట్టు’ అని చెప్పడమే కాక, చారిత్రక మాటనొకి ఉటంకించారు: ”తల్లులు వారి సంతానాన్ని సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలు గల వారుగా జన్మనిస్తే మీరెప్పి నుంచి వారిని బానిసలుగా మార్చుకోవడం ప్రారంభిం చారు?” అని. ఈ సందర్భంగా హజ్రత్‌ అలీ (ర) గారు చెప్పిన మాట గమనా ర్హం! ”అల్లాహ్‌ా నిన్ను సేచ్ఛాపరునిగా ప్టుించినప్పుడు ఎవ్వరికీ ఊడిగం చేసే అగత్యం నీకు రాకూడదు”.

ఆధునికంలో బానిసత్వ రూపాలు:

ఆటవికం నుండి మనిషి ఆధునికంలో అడుగు పెట్టే క్రమంలో కొన్ని పాత రాతారీతులకయ పాతరేసినా అవే కొంగ్రొత్త రూపంలో కోరలు చాచడం విడ్డూరం! అవన్నీ స్వేచ్ఛ పేరు మీద ప్రవేశ పెట్టబడ్డాయి అన్నది గమనార్హం!! కమ్యూనిజం అయినా, కాపటలిజమయినా వాస్తవంగా ప్రాచీన బానిసత్వపు సరికొత్త రూపాలే. ఒక చోటు నియంత ప్రభుత్వం, మరో చోట నిరంకుశ ప్రభువులు. మనుషులు గత్యంతరం లేక స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు బదులుగా బానిసత్వాన్ని కోరుకునేలా ఆర్థిక, రాజకీయ, ఆధ్యాత్మిక చింతనాత్మక వాతా వరణాన్ని సృజించాయి. ఆధునికం పేరుతో బరి తెగించి తిరగాడే సొసౖీె గర్ల్స్‌ ఏ ‘స్వేచ్ఛ’ పేరుతోనయితే తమ శరీరాలను ఇతరులకు అప్పజెప్పుతారో అది స్వేచ్ఛ కాదు పచ్చి బానిసత్వం.

నేడు యువత నోట తరచూ వినబడే మాట – ‘ఎవరడ్డు చెప్పనంత వరకు తప్పు కాదురో, నువ్వు బాధ పెట్టనంత వరకు తప్పు కాదురో, అంతా చేసినాక సొరీ చెప్పి ముగిస్తే తప్పేం కాదోయ్‌’ అన్నది. ఈ మాట మహా మోసపూరిత మయినది. ఒక వ్యక్తి ఇంి లోపల కూర్చుని మాదకద్రవ్యాల్ని, మత్తు పదార్థాల్ని సేవిస్తే తప్పు కాదనా? అతను చేస్తున్నది కరెక్ట్‌ అనా దీనర్థం? అల్లాహ్‌ సాక్షిగా! ఇది మాయావి అయిన షైతాన్‌ అందమైన నినాదం. అందమైన పేర్లు, మనోహరమయిన పదాలు, మనోజ్ఞమయిన పదబంధాలు, వినసొంపయిన నినాదాలు మనందరి బహిరంగ శత్రువయిన షైతాన్‌ ఎత్తుగడలోని అంతర్భాగాలు. ఇలాిం పైపూత ప్రేరకాలకు, మోసపూరిత ఆకర్షణలకు ఆమడ దూరం ఉండాలి.

బానిస కూలీలు:

కొంత భూమిని ఒకరికిచ్చి జీవితాంతం వారితో ఊడిగం చేయిపించుకో వడం. ఈ విధమయినటువిం బానిసత్వం నేికీ పల్లే ప్రాంతాల్లో, ఆధునిక ముసుగులో పట్టణ ప్రాంతాల్లో దర్శనమిస్తుంది. ఒక వంశానికి, కులానికి చెందిన వారు ఇదే పని చెయ్యాలన్న నియతి ఇస్లాంలో లేదు. ఆ విషయాని కొస్తే ఇస్లాం పరమ ఆదర్శవంతులుగా పేర్కొనే ప్రవక్తలు కూలీ పని చేసిన వారే. జీతానికి గొర్రెలు మేపినవారే. ‘కూలీవాని చెమట ఆరక ముందే అతని వెతనం చెల్లించాల’న్నది ఇస్లాం ఆదేశం. (ఇబ్ను మాజహ్‌) ”ఒక వ్యక్తిని కూలీకి పిలిచి, అతనితో మొత్తం పని చేయిపించుకుని కూలీ ఇవ్వకుండా ఎగ్గొ ి్టనోడికి వ్యతిరేకంగా రేపు ప్రళయ దినాన నేను పోరాడుతాను” అన్నారు ప్రవక్త ముహమ్మద్‌ (స). అలాగే ఒక పని గురించి చెప్పి వేరే పని చేయించు కునేవారు, ఒక సమయం చెప్పి ఆ సమాయనికన్నా ఎక్కువ అతని శ్రమను జలగల్లా పీల్చేవారు, ఒక వెతనం గురించి మాిచ్చి మాట తప్పేవారు, విదే శాల్లో మంచి జీతం అంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపించి మొండి చెయ్యి చూపించి కట్టు బానిసల్ని చేసేవారు, వందల్లో, వేలల్లో పిల్లల్ని, వృద్ధుల్ని ప్రోగు చేసి వారి చేత భిక్షం ఎత్తించి బీభత్సంగా వ్యవరించేవారు అందరూ నేడు మనిషి స్వేచ్ఛ, శ్రమను దోచుకునే దోపిడి దొంగలే, దగాకోరులే!

బానిసత్వం రెండు రకాలు. ఒకి: దేహపరమయిన బానిసత్వం – చాలా దేశాలు ఈ విధమయినటువిం బానిసత్వం నుండి ముక్తి పొంది స్వేచ్ఛా వాయువుల్లో జీవిస్తున్నాయి. రెండవది: మానసిక బానిసత్వం: ఈ విధమయి నటువిం బానిసత్వానికి దాదాపు దేశాల ప్రజలు గురయి ఉన్నారు. మత స్వేచ్ఛ పేరుతో ఆంబోతు ముందర మొకరిల్లడం, జర జర ప్రాకే పాముకు దండం పెట్టడం స్వేచ్ఛ కాదు, సత్యం అంతకన్నా కాదు. అది బహిరంగ బాని సత్వం. బాహ్య బానిసత్వం నుండి ముక్తి పొందే ప్రయత్నం మనిషి చేసినంత గా మానసికమయిన, ఆత్మపరమయిన ఈ బానిసత్వం నుండి బయట పడే ప్రయత్నం చేయడం లేదు. ఇదే యదార్థాన్ని తెలియజేస్తూ ఖుర్‌ఆన్‌ ఇలా అంటుంది: ”నిశ్చయంగా మేము మానువుణ్ణి అత్యుత్తమ ఆకారంలో పుట్టిం చాము. అటుపిమ్మట అతన్ని (అతని నిర్వాకాల కారణంగా) అధమాతి అధమ స్థానానికి మళ్ళించాము”. (అత్తీన్‌: 4,5) ఫలితంగా అతనికి కోతంటే భయమే, కొమ్మంటే భయమే, రాయంటే భయమే, రప్పంటే భయమే, తుమ్మంటే భయమే, రాశంటే భయమే, వాస్తంటే భయమే. నిజ ఆరాధ్యుడయిన ఒక్క అల్లాహ్‌కు భయపడని కారణంగా ఎన్ని భయాలు అతన్ని చుట్టమ్టుాయో, ఎందరికి అతను ఊడిగం చేయాల్సి వస్తుందో గమనించండి! ఇస్లాం మనిషికి బాహ్యపరమయిన స్వేచ్ఛను ప్రసాదించడమే కాక, ఆత్మపరమయిన, ఆధ్యాత్మిక పరమయిన బానిసత్వం నుండి సయితం ముక్తిని ప్రసాదిస్తుంది.

నేటి ప్రపంచం భౌతిక వాదం, ఆర్థిక సంఘర్షణల ద్విగుణ అభిశాపంతో కొట్టుమ్టిడుతోంది. భౌతిక వాదం మనిషి ఆత్మ,మనస్సు రిెం ప్రశాంతతను దోచుకుంటుంది. ఆర్థిక ఘర్షణ ప్రపంచాన్ని నిరంతర అలజడికి ఆటపట్టుగా మార్చేస్తుంది. ఇస్లాం ఈ రెంటికి మధ్య మధ్యేమార్గం. ప్రపంచం నేడు కాక పోయినా రేపయినా సరే ఇస్లాం విలువను గుర్తిస్తుంది.

లాస్ట్‌ బట్ నాట్ లిస్ట్‌ – ఏ జాతి ప్రజలయితే తమ మనోకాంక్షలను, భావోద్రే కాలను తన అధీనంలో ఉంచుకోరో, తమకు ఇవ్వబడిన స్వేచ్ఛను సద్విని యోగ పర్చుకోరో, మరెవరయితే అవసరం ఏర్పడినా తమకు ప్రియమయిన వాటిని వదులుకోవడాన్ని ఇష్ట పడరో అలాిం” జాతి నాయకత్వపు (స్వాతం త్య్ర) హోదాను పొందజాలదు. అలాగే అంతర్జాతీయ సంఘర్షనల్లో ఏ జాతి ప్రజలయితే కష్టాలను, ఆపదలను భరించే సామర్థ్యం కలిగి ఉంటారో, అవసరం కలిగినప్పుడు ఎవరయితే తమ మనోభిరామమయిన కోరికల్ని గంటలు, దినాలు కాదు; సంవత్సరాల తరబడి త్యజించే నిబ్బరం చూపగలరో అలాిం పురుషోత్తములకే విజయశ్రీ కాళ్ళు పడుతుంది.

Related Post