సమయం – సందర్భం

 ''ఎవరైతే ప్రజల్ని అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశకు గురి చెయ్యడో, వారు దైవాజ్ఞల్ని ఉల్లంఘించడానికి అనుమతించడో, వారిని అల్లాహ్‌ శిక్ష  పట్ల భయపడనట్లు చెయ్యడో - అలాంటి ధర్మ జ్ఞానియే నిజమైన స్థిత ప్రజ్ఞుడు''

”ఎవరైతే ప్రజల్ని అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశకు గురి చెయ్యడో, వారు దైవాజ్ఞల్ని ఉల్లంఘించడానికి అనుమతించడో, వారిని అల్లాహ్‌ శిక్ష పట్ల భయపడనట్లు చెయ్యడో – అలాంటి ధర్మ జ్ఞానియే నిజమైన స్థిత ప్రజ్ఞుడు”

ప్రతి భాషలోనూ మాట్లాడే తీరు, ప్రసంగించేె విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ భాషలో మాట్లాడదలచిన వారు వాటిని తెలుసుకోవడం అత్యవసరం. అది ప్రాతీయ చలోక్తులు, సామెతలు, శతకాలు, సుభాషితాలు, పద్యాలు, గద్యాలు, కావ్యాలు ఏవైనా కావచ్చు. వీటి మాధ్యమంతో శ్రోతల హృదయాలను హత్తుకునేలా మాటను చెప్ప గలుగుతాము. అలాగే శ్రోతలను బట్టి భాష, విషయం ఉండాలి. ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అన్నట్టు సామాన్యులతో తాత్విక భాషణలు, చర్చలు లేవనెత్తడం, బరువయిన పదాలను, సమాసాలను వాడటం ఎంత మాత్రం వివేకం అన్పించుకోదు. పైగా ఈ వైఖరి వల్ల మనం అందించాలనుకున్న సందేశం వైఫల్యం చెందుతుంది. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) గురించి ఆయన సతీమణి విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర) ఇలా అభిప్రాయపడ్డారు: ”ఆయన (స) మాట ఎంతో విపులంగా, సరళంగా స్పష్టంగా ఉంటుంది. విన్న ప్రతివాడు ఇట్టే అర్థం చెసుకునేవాడు”. (అబూ దావూద్‌)

ఇకపోతే, మనిషి మానసికంగా మాటను విని జీర్ణించుకోగల స్థితిలో ఉన్నప్పుడే ఏదైనా విషయాన్ని అతనికి బోధించాలి. అలా కాక మనసు పరధ్యానానికి లోనై ఉన్నప్పుడు బలవంతంగా ఏదయినా వినిపిస్తే మొండిగా ఆ బోధను తిరస్కరించే ప్రమాదముంది. వివేకం కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తించే అవకాశమూ లేకపోలేదు. హజ్రత్‌ అలీ (ర) ఇలా ఉపదేశించారు: ”మనసులకు (హృదయాలకు) కొన్ని తత్వాలుంటాయి. కొన్ని ప్రీతికర విషయాలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆంత ర్యాలు మాటను స్వీకరించటానికి అనుకూలంగా ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో వాటిలో వెన్ను చూపే స్వభావం ప్రబలి ఉంటుంది. కనుక ప్రజల ఆంతర్యాల తత్వాన్ని బట్టి, అవి హితవును అంగీకరిం చేందుకు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిలో ప్రవేశించండి. ఎందు కంటే, మనసును బలాత్కరించినప్పుడు అది గుడ్డిదయిపోతుంది”. (కితాబుల్‌ ఖిరాజ్‌ – అబూ యూసుఫ్‌)

మరో సదర్భంలో హజ్రత్‌ అలీ (ర) ఇలా అభిప్రాపడ్డారు: ”ఎవరైతే ప్రజల్ని అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశకు గురి చెయ్యడో, వారు దైవాజ్ఞల్ని ఉల్లంఘించడానికి అనుమతించడో, వారిని అల్లాహ్‌ శిక్ష  పట్ల భయపడనట్లు చెయ్యడో – అలాంటి ధర్మ జ్ఞానియే నిజమైన స్థిత ప్రజ్ఞుడు”. (కితాబుల్‌ ఖిరాజ్‌)

అంటే – ప్రజలు తమ మోక్షం పట్ల, అల్లాహ్‌ా కారుణ్యం పట్ల నిరాశ చెందేలా నకారాత్మక బోధనలు చేయడం (బాధ గురువులుగా వ్యవ హరించడం) ఎంత తప్పో, ఆల్లాహ్‌ా క్షమా గుణాన్ని, కృపాకటాక్షాల్ని, ప్రవక్త (స) వారి సిఫారసును తప్పుగా చిత్రీకరించి ప్రజలు దైవాజ్ఞ ఉల్లంఘనకు పాల్పడేలా చేయడం, వారిని మొరటు వ్యక్తులుగా తయారు చేసే ఊక దంపుడు ఉపన్యాసాలివ్వడం కూడా అంతే ఘోర మైన నేరం. సరయిన పంథా ఏమంటే, ఉభయ కోణాలూ ముందుం డాలి. అటు నిరాశా జనించకూడదు. ఇటు నిర్భయము, దుస్సాహ సమూ కలగకూడదు.
దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రజల్ని తీర్చిదిద్దే నిమిత్తం సరైన సమయం సందర్బం కోసం ఎదురు చూస్తుండేవారు. అలా ప్రాప్త మయిన మంచి అవకశాన్ని ఆయన సద్వినియోగ పరచుకునేవారు.

ఓ సారి దైవ ప్రవక్త (స) వారి సమక్షంలోకి కొంత మంది ఖైదీలు తేెబడ్డారు. ఆ ఖైదీలలో ఓ మహిళ కూడా ఉంది. ఆమె స్తనాల్లో పాలు నిండుగా ఉన్నాయి. ఆ ఖైదీలలో ఒక పసి బాలుడు ఏడ్వడం చూసి ఆమెలోని మమత ఉప్పొంగింది. వెళ్ళి అ పసికందుని అమాంతంగా తన గుండెలకు హత్తుకుని పాలు పట్ట సాగింది. ఈ అద్భుత ధృశ్యాన్ని మహా ప్రవక్త (స) మరియు ఆయన సహచరులు తిలకిస్తున్నారు. (తన సహచరుల్ని ఆ తల్లి ప్రేమ ఆశ్చర్యచకితుల్ని చేెసిందన్న విషయాన్ని గ్రహించిన ప్రవక్త (స) సత్యోపదేశం కోసం ఇది సువర్ణ సమయ మని భావించి) ”ఈ మాతృమూర్తి గురించి మీ అభిప్రాయమేమిటి? ఈమే తన సొంత కుమారుణ్ణి స్వహస్తాలతో అగ్నికి ఆహుతి చెయ్య గలదా?” అని వారిని ప్రశ్నించారు. ‘అల్లాహ్‌ా సాక్షి! ఈ తల్లి తన చేజే తులా తన పిల్లవాణ్ణి నిప్పుల్లో పడవేయజాలదు’ అని సహాబా ముక్త కంఠంతో బదులిచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త (స) ఇలా హితోపదేశం చేశారు: ”ఈ మాతృమూర్తికి తన పిల్లవానిపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే (మరో ఉల్లేఖనం ప్రకారం 70 తల్లులకంటే) ఎక్కువ ప్రేమ అల్లాహ్‌ాకు తన దాసులపై ఉంటుంది”. (బుఖారీ ముస్లిం)

ఓ సారి దైవ ప్రవక్త (స) బజారు గుండా వెళుతున్నారు. ఆయన ఇరుప్రక్కల జనం ఉన్నారు. దారి ప్రక్కన చచ్చి పడి ఉన్న పొట్టి చెవులు గల ఓ మేక పిల్లను చూశారు. (క్రింద కూర్చోని) దాని చెవి పట్టుకొని: ”మీలో ఎవరైనా దీన్ని ఒక్క దిర్హముకైనా కొనడానికి ఇష్టపడతారా?” అని ప్రశ్నించారాయన.
అందుకు – ‘దిర్హముకన్నా తక్కువ ఖరీదుకు కూడా మేము దాన్ని తీసుకోము. ఒకేళ తీసుకున్నా దాన్ని మేమేం చేసుకుంటాము?’ అని బదులిచ్చారు ప్రజలు. అది విన్న దైవ ప్రవక్త: ”ఒకవేళ ఉచితంగా లభిస్తే తీసుకోవడానికి ఇష్టపడతారా?” అని మళ్ళీ అడిగారు. దానికి వారు – ‘అల్లాహ్‌ా సాక్షి! ఒకవేళ అది బ్రతికున్నా (మేము దాన్ని తీసు కోవడానికి ఇష్టపడేవారము కాము) దీనిలో లోపం ఉంది. దీని చెవులు పొట్టిగా ఉన్నాయి. ఇక చచ్చిపోయిన తర్వాత ఎలా తీసుకుం టాం?’ అని అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త (స) ”వల్లాహి! ఈ మేక పిల్ల మీ దృష్టిలో ఎంత హేయమైనదో అల్లాహ్‌ా దృష్టిలో ఈ లోకం అంతకన్నా హేయమైనది” అని హితవు పలికారు. (ముస్లిం)

చచ్చి కంపు కొట్టే పశువు దగ్గర నిలబడటం ఎవరికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఆ మార్గం గుండా వెళ్ళాల్సి వస్తే ముక్కు పుటాలు మూసుకుని మరీ తొందరగా ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు ప్రజలు. ఆ చచ్చిన మేక పిల్ల పట్ల అక్కడున్న ప్రజల్లో గల ఏహ్య భావాన్ని గమనించిన ప్రవక్త (స) ఏం చేశారంటే – ముందు ఆ మేక పిల్ల వద్దకు వెళ్ళారు. తర్వాత దాని చెవులు పట్టు కున్నారు. ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ సందర్భాన్ని హితవు గరిపేందుకు మంచి అవకాశంగా భావించి, వారికి ఐహిక వాస్తవికతను తెలియ పర్చడమే కాక, వారిలోని ప్రాపంచిక వ్యామో హాన్ని అంతమొందించి, పరలోకం కోసం పాటుపడేలా వారిని ప్రేరే పించారు. సుబ్హానల్లాహ్‌!

ఓ సారి ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి – ”యా రసూలల్లాహ్‌ా! ప్రళయం ఎప్పుడొస్తుందంటారు?” అని ప్రశ్నించాడు.
చూడబోతే ఈ ప్రశ్న చాలా సామాన్యమైన ప్రశ్నగానే గోచరిస్తుంది. ఆ వ్యక్తి అడిగిన తీరు కూడా సాధారణమైనదే. ప్రవక్త (స) అతనికి బదులిచ్చి సాగనంపాల్సింది. కొన్ని ప్రళయ సూచనలు తెలియజేసి అతని నోరు మూయించాల్సింది. లేదా ఆ దినం గూర్చిగానీ, ఆ ఘడియ గూర్చి గాని నాకు తెలియదు అని, అల్లాహ్‌ాకు మాత్రమే తెలుసునని దాట వేయాల్సింది. కాని ఆయన (స) అలా చేయలేదు. ఆయన అతని అంతర్మధనాన్ని అంచనా వేశారు. పరలోక భీతితో అతని మనో స్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ కారణంగానే తను ఈ ప్రశ్న అడిగాడు. ఇది శిక్షణకు సరైన సమయం అని భావించి ప్రవక్త (స) – జవాబివ్వడానికి బదులు అతనికే ఎదురు ప్రశ్న వేశారు: ”ఆ ఘడియ కోసం నువ్వు ఏ విధమైనటువంటి సామగ్రిని కూడబెట్టు కున్నావు?” అని.

ఈ చిన్న ప్రశ్నతో దైవ ప్రవక్త (స) అతని ఆలోచనా స్రవంతిని సకా రాత్మక దిశన పయనించేలా చేశారు. ప్రళయం ఎప్పుడు వస్తుందన్నది కాదు సమస్య. ప్రళయం కోసం మనం ఏం సమకూర్చుకున్నామన్నది అసలు సమస్య. ఒకవేళ ప్రళయం ఆలస్యంగా వచ్చినా మన వద్ద ఏ విధమైనటువంటి ముందస్తు సామగ్రి లేకపోతే ప్రయోజనం పూజ్యం. అదే మనం అన్ని విధాల సమాయత్తమయి ఉంటే ప్రళయం ఈ క్షణం వచ్చినా భయం లేదు అని స్వయంగా ఆ వ్యక్తి గ్రహించేలా, ఆత్మావ లోకనం చేసుకునేలా చేశారు. అది విన్న ఆ వ్యక్తి తన యావత్తు జీవితాన్ని సునిశితంగా పరిశీలించి ఇలా అన్నాడు: ”అల్లాహ్‌ పట్ల మరియు ఆయన ప్రవక్త (స) పట్ల ప్రేమ”.

అంటే, నేను కూడబెట్టుకున్న పరలోక సామగ్రల్లా దైవ ప్రేమ, మరియు దైవ ప్రవక్త (స) వారి ప్రేమ అంతే. జీవిత అన్ని రంగాల్లో అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త (స)ను ప్రసన్నుల్ని చేయడమే నా ల క్ష్యం. నా జీవిత ధ్యేయం దైవ దాస్యం. నా జీవితం అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్తకే అంకితం అన్నాడు. అతని నోట ఈ మాట విన్న విశ్వ నాయకులు (స) సంతోషంతో పరవశించిపోతూ అతనికి శుభవార్తను అందజేశారు:
”నువ్వు ప్రేమించే, అభిమానించే వారి సరసనే రేపు ప్రళయ దినాన నువ్వుంటావు” అన్నారు. సుబ్బానాల్లహ్‌! (బుఖారీ, ముస్లిం)

Related Post