జుమా నమాజు

 ''రేపు ప్రళయ దినాన అందరి తర్వాత వచ్చి అందరికన్నా ముందుండే సముదాయం మేమే అవుతాము. యూద క్రైస్తవులకు మనకన్నా ముందు గ్రంథం ఇవ్వబడింది, వారు ఆ విషయంలో విభేదించుకున్నారు. ప్రతి విషయంలోనూ ప్రజలు మా వెనకాలే ఉంటారు. మమ్మల్నే అనుసరిస్తారు. ''యూదులు రేపు, క్రైస్తవులు మర్నాడు'' అన్నారు. (బుఖారీ 836, ముస్లిం 855)

”రేపు ప్రళయ దినాన అందరి తర్వాత వచ్చి అందరికన్నా ముందుండే సముదాయం మేమే అవుతాము. యూద క్రైస్తవులకు మనకన్నా ముందు గ్రంథం ఇవ్వబడింది, వారు ఆ విషయంలో విభేదించుకున్నారు. ప్రతి విషయంలోనూ ప్రజలు మా వెనకాలే ఉంటారు. మమ్మల్నే అనుసరిస్తారు. ”యూదులు రేపు, క్రైస్తవులు మర్నాడు” అన్నారు. (బుఖారీ 836, ముస్లిం 855)

ఐ పి సి తెలుగు విభాగం

అబూ హురైరా(ర) కథనం ఆయన దైవప్రవక్త(స) వారిని ఇలా చెబుతుండగా విన్నారు: ”రేపు ప్రళయ దినాన అందరి తర్వాత వచ్చి అందరికన్నా ముందుండే సముదాయం మేమే అవుతాము. యూద క్రైస్తవులకు మనకన్నా ముందు గ్రంథం ఇవ్వబడింది, వారు ఆ విషయంలో విభేదించుకున్నారు. ప్రతి విషయంలోనూ ప్రజలు మా వెనకాలే ఉంటారు. మమ్మల్నే అనుసరిస్తారు. ”యూదులు రేపు, క్రైస్తవులు మర్నాడు” అన్నారు. (బుఖారీ 836, ముస్లిం 855)

అయితే జుమా నమాజు హిజ్రత్‌కి పూర్వం మక్కాలో విధి గావించబడింది. అయితే మక్కాలో ఉన్నంతకాలం అది స్థాపించ బడలేదు. కారణం ప్రవక్త(స)వారి సహచరులు చాలా దయనీయ స్థితిని ఎదుర్కుంటూ ఉండేవారు గనక. హజ్రత్‌ అస్‌అద్‌ బిన్‌ జరారా(ర) గారు ప్రవక్త(స)వారి మదీనా ఆగమనానికి (హిజ్రత్‌కి) పూర్వమే మదీనాలో జుమా నమాజు స్థాపించారు. కాబ్‌ బిన్‌ మాలిక్‌(ర) గారి కథనం ద్వారా మనకీ విషయం బోధపడుతుంది.
ఆధారం:

”ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్‌ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్‌ా ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది.(జుమా:9)

అబూ హురైరా(ర) మరియు అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌(ర) కథనం మేరకు వారిరువురూ ప్రవక్త(స) వారి వేదిక మీద ఈ విషయం చెబుతుండగా విన్నారు: ”ప్రజలు జుమా నమాజులు వదలడం మానుకోవాలి లేదా అల్లాహ్‌ా వారి హృదయాలకు ముద్ర వేస్తాడు. ఫలితంగా వారు శాశ్వతంగా ఏమరుపాటుకు లోనయ్యే ప్రమాదం ఉంది.” (ముస్లిం 865)

జుమా నమాజు షరీయతు బద్ధం చేయడం వెనకాల పరమార్థం:
జుమా నమాజు విధి చేయడం వెనకాల అనేక ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమయినవి- పట్టణంలో నివసించే, ఊరిలో నివసించే ప్రజలంతా పరస్పరం ఒక చోట కలుసుకోవటం. ఆ ప్రదేశమే జామె మస్జిద్‌. ఈ కలుసుకోవడం అనేది వారానికోసారి జరుగుతుంది. వారందరూ ధర్మోపదేశాన్ని వినేందుకు హాజరవుతారు. అలా వారు ప్రోగవ్వడం వారి మధ్య ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మరింత దృఢతరం చేస్తుంది. ఈ కారణంగానే ఇస్లాం జుమా నమాజు కోసం హాజరవ్వమని ప్రోత్సహించింది. దాన్ని విడనాడటం నుంచి వారించింది.

జుమా విధి అవ్వడానికి షరతులు
1. ముస్లిం అయి ఉండాలి.
2.యౌనస్తుడయి ఉండాలి.
3. బుద్ధిమంతుడయి ఉండాలి.
4. స్వాతంత్రుడయి ఉండాలి. బానిస మీద జుమా వాజిబ్‌ కాదు.
5. పురుషుడయి ఉండాలి. స్త్రీలపై వాజిబ్‌ కాదు.
6. దేహ ఆరోగ్యం కలిగి ఉండాలి. వ్యాధిగ్రస్తుని మీద జుమా లేదు.
7. జుమా నిర్వహించబడుతున్న ప్రదేశంలో నివాసం (స్థానికుడయి) ఉండాలి. బాటసారిపై నమాజు లేదు. అలాగే స్థానికుడు సయితం జుమా నెరవేరని ప్రదేశంలో ఉంటే జుమా అతనిపై వాజిబ్‌ కాదు. ఉదాహరణకు: నలభయి మందికన్నా తక్కువ ముస్లిం జనాభా గల ఊరిలో అతనున్నాడు, దాంతోపాటు ఏ సమీప పట్టణంలోనయితే జుమా నిర్వహించబడుతుందో అక్కడి అజాన్‌ సయితం విన్పించడం లేదంటే అలాంటి వ్యక్తిపై జుమా వాజిబ్‌ కాదు.
తారిఖ్‌ బిన్‌ షిహాబ్‌ (ర) గారి కథనం- దైవప్రవక్త(స) ఇలా ప్రవచించారు: ”జుమా నమాజు సామూహికంగా చేయడం ముస్లిం అయిన ప్రతి వ్యక్తిపై తప్పనిసరి విధి. అయితే నలుగురికి మినహాయింపు ఉంటుంది: బానిస, స్త్రీ, ప్రాజ్ఞ వయసుకు చేరని బాలుడు, వ్యాధిగ్రస్తుడు.” (అబూ దావూద్‌ 1067)
మరో ఉల్లేఖనంలో ప్రవక్త(స) ఇలా అన్నారు: ” అజాన్‌ విన్న ప్రతి ముస్లింపై జుమా విధి అవుతుంది.”
(అబూదావూద్‌ 1056)

జుమా నెరవేరేందుకు షరతులు:

పై ఏడు షరతులు పూర్తయితే జుమా నమాజు విధి అవుతుంది. అయితే నమాజు నెరవేరాలి అంటే క్రింది నాలుగు షరతులు కూడా పూర్తవ్వాలి:
1. జుమా నమాజు భవనాలు, ఇళ్ళు గల ప్రదేశంలో స్థాపించాలి. అది పట్టణమయినా 40 మంది నివసించే పల్లెసీమ అయినా పరవాలేదు.
2. జుమా నమాజు చేయబడే ప్రదేశంలో జుమా నమాజు విధి అయ్యే ముగ్గురు 40 తీరాలి. వారు స్థానికులైన
పురుషులు. (ఇది షాఫయి మస్లక్ను అనుసరించే వారి అభిప్రాయం. ఇతర పండితులు ముగ్గురు ఉంటె కూడా జుమా ఫర్జ్ అవుతుంది అంటారు)

3. జుమా నమాజు జుహ్ర్‌ నమాజు సమయంలో చేయబడుతుంది. ఒకవేళ అలా కుదరకపోతే వారు నాలుగు రకాతులు
చదవుకోవాలి.
హజ్రత్‌ అనస్‌ (ర) గారి కథనం- దైవ ప్రవక్త (స) ‘పొద్దు వాలే సమయంలో జుమా నమాజు చేసే వారు” (బుఖారీ-862)
హజ్రత్‌ సహల్‌ బిన్‌ సఅద్‌ (ర) గారి కథనం – మేము మధ్యాహ్న భోజనం గానీ, ఖైలూలా (కునుకుపాటు) గానీ జుమా నమాజు అనంతరమే చేసేవారము”. (బుఖారీ – 897)
4) ఒకే పట్టణం అనేక జుమాలు నిర్వహించకూడదు. వీలయినంత వరకూ పట్ట ప్రజలంతా ఒకే చోటు జుమా నమాజు చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ స్థలం సరిపోవకపోతే అప్పుడు ఒకటికి మించిన జుమాలు ఒకే పట్టణంలో చేసుకునే అనుమతి ఉంటుంది. ఒకవేళ ఏ అవసరమూ లేకుండానే ఒకే పట్టణంలో అనేక జుమా నమాజులు చేయబడుతున్నాయంటే వాటిలో మొదట ప్రారంభమయిన జుమా నమాజు మాత్రమే ఆమోదయోగ్యమవుతుంది. మిగతావన్నీ రద్దు చేయబడతాయి. వారు దానికి బదులుగా జుహర్‌ నమాజు చేసుకోవాలి.
ఈ షరతు పరమార్థం ఏమిటంటే, జుమా ముఖ్యోద్దేశం అయిన ఐక్యత ప్రాప్తమవుతుంది.

జుమా ఫర్జ్‌లు
మొదటిది: రెండు ఖుత్బాలు

1) ఈ రెండు ఖుత్బాల్లోనూ సాధ్యమయినంత వరకూ నిలబడాలి. ఈ రెంటికి మధ్యలో కూర్చోవడం ద్వారా వాటిని వేరుపర్చవచ్చు.
హజ్రత్‌ జాబిర్‌ (ర) గారి కథనం- ”నిశ్చయంగా దైవప్రవక్త (స) నిలబడి ఖుత్బా ఇచ్చేవారు. ఆ తర్వాత కూర్చునేవారు. తిరిగి మళ్ళి నిలబడి ఖుత్బా ఇచ్చేవారు”. (ముస్లిం: 862)
2) నమాజు తర్వాత చేయకూడదు: జుమా నమాజు గురించి వచ్చిన అనేక హదీసుల ఆధారంగా, మరియు ఈ విషయంలో ముస్లింలందరి సమైక్యత కారణంగా ఖుత్బాను ఆలస్యం చేసి చెప్పకూడదు.
3) ఖతీబ్‌ (ప్రసంగీకులు) హదసె అస్గర్‌, మరియు హదసె అక్బర్‌ నుండి శుద్ధి పొంది ఉండాలి. అలాగే స్థలం, దేహం, దుస్తులు సయితం పరిశుభ్రంగా ఉండాలి. మర్మావయవాలు కప్పబడి ఉండాలి. ఎందుకంటే, ఖుత్బా నమాజు వంటిదే. ఈ కారణంగానే రెండు ఖుత్బాలు జుహర్‌ రెండు రకాతు స్థానంలో భావించబడ్డాయి. నమాజు కోసం ఏ షరతులు అవసరమో అవే షరతులు ఖుత్బా కోసం కూడా వర్తిస్తాయి.
.
4) ఖుత్బా అర్కానులను అరబీలోనే ఉచ్చరించాలి: ప్రసంగీకులు అరబీలోనే ఖుత్బా ఇవ్వాలి. అది నమాజీలకు అర్థం కాకపోయినా సరే. ఒకవేళ అరబీ తెలిసినవారు ఎవరూ లేక, సుదీర్ఘ కాలం గడిచినా వారిలో ఎవ్వరూ అరబీ నేర్చుకోకపోతే ఆ పాపం వారందరిపై ఉంటుంది. వారి జుమా చదవకూడదు, దానికి బదులు జుహ్ర్‌ా నమాజు చేెసుకోవాలి. అరబీ నేర్చుకోగలిగే పరిమిత సమయంలో జుమా అర్కానులను ఏ భాషలో అనువదించినా జుమా నమాజు నెరవేరుతుంది.
5) ఖుత్భా అర్కానుల మధ్య క్రమాన్ని పాటించడం: మొదటి మరియు రెండవ ఖుత్బాకి మధ్య, రెండవ ఖుత్బా నమాజుకి మధ్య క్రమాన్ని పాటించాలి (ఒకటి తర్వాత ఒకటి వెనువెంటనే చేయాలి). ఒకవేళ మొదటి మరియు రెండవ ఖుత్బాకి మధ్య విరామం సుదీర్ఘమయినా, రెండవ ఖుత్బా మరియు నమాజుకి మధ్య విరామం సుదీర్ఘమయినా ఖుత్బా నెరవేరదు. దాన్ని నివారించగలిగేంత సమయం ఉంటే మళ్ళీ వాటిని చేయాలి. సమయం అయిపోతే జుమా స్థానంలో జుహ్ర్‌ా నమాజు చేెసుకోవాలి.
6) ఖుత్బా అర్కానులు మంది వినగలిగేంత హెచ్చు స్వరంతో ఇవ్వాలి.

ఖుత్బా అర్కానులు

1) అల్లాహ్‌ స్తోత్రం; స్తోత్రం క్రిందికి వచ్చే ఏ పదాలతోనయినా సరే.
2) ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపై దరూద్‌. దరూద్‌గా వచ్చిన ఏ పదాలతోనయినా సరే. అయితే షరతు ఏమిటంటే స్పష్టంగా ఆయన పేరును ఉచ్చరించాలి; దైవప్రవక్త, సందేశహరుడు లేదా ముహ్మద్‌ అని. పేరుకి బదులు సూచనాప్రాయంగా ఏదయినా పదాన్ని వాడకూడదు.
3) దైవభీతిని గురించి హితవు పలకడం, ఎలాంటి పదాలు, పద్ధతితోనయినా.
ఈ మూడు ఖుత్బా అర్కానులు అనబడతాయి. వీటిని ప్రస్తావించకుండా ఖుత్బా నెరవేరదు.
4) రెండు ఖుత్బాలో ఏదోక ఖుత్బాలో ఖుర్‌ఆన్‌ వచనాన్ని చదవడం: చదివే ఆయతు స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలి. సూరా ప్రారంభంలో వచ్చే అక్షరాలను చదివితే సరిపోదు.
5) రెండవ ఖుత్బాలో ముస్లింలందరి కోసం దుఆ చేయాలి.
రెండవది: సామూహికంగా రెండు రకాతుల నమాజు చదవడం.

హజ్రత్‌ ఉమర్‌ (ర) ఇలా అన్నారు: ”దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మాట ప్రకారం-”జుమా నమాజు రెండు రకాతులు”.
(నసాయీ -111/3)
జుమా నమాజ్‌ కొరకు ఆలస్యంగా వచ్చేవారు:
1.జమాతుతో ఒక రకాతును పొందడం షరతు. ఒక రకాతుని పొందని పక్షంలో సదరు వ్యక్తి జుహ్ర్‌ా చేసుకోవాలి.
2.ఆలస్యంగా వచ్చిన వ్యక్తి రెండవ రకాతులో ఇమామ్‌ రుకూ నుండి లేచిన మీదట వచ్చి కలుసుకుంటే అతని జుమా నెరవేరదు. ఇమామ్‌ సలామ్‌ చెప్పిన పిమ్మట అతను జుహ్ర్‌ా నమాజు చేసుకోవాలి.
3.ముక్తదీన్లు కొందరు జుమా నమాజులో ఇమామ్‌ను అనుసరిస్తూ ఒక రకాతు చదివి తర్వాత అనివార్య కారణం వల్ల వేరయి ఎవరికి వారుగా నమాజు పూర్తి చేసుకుంటే వారి నమాజు నెరవేరుతుంది. అదే అనివార్య కారణం మొదటి రకాతు పూర్తి కాక ముందే ఏర్పడి వారు వేరయితే వారి జుమా నెరవేరదు. దాని స్థానంలో జుహ్ర్‌ా చేసుకోవాల్సి ఉంటుంది.

జుమా ఆదాబులు (మర్యాదలు)
1) గుసుల్‌ – స్నానం
2) శరీరాన్ని మలీనాల నుండి శుభ్ర పర్చుకోవడం. పురుషులు సువాసన పూసుకోవడం, నూనె రాసుకోవడం.

హజ్రత్‌ సల్మాన్‌ ఫారసీ (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఎవరయినా జుమా రోజు గుసుల్‌ చేసి, వీలయినంత వరకు పరిశుభ్రతను పాటించి, నూనె రాసుకొని, తన ఇంటి నుండి సువాసన పూసుకొని నేరుగా మస్జిద్‌కు వెళ్ళి ఏ ఇద్దరి మధ్య చీలిక ఏర్పరచకుండా, అక్కడ తాను చేయగలిగినన్ని నమాజులు చేసి, ఆ తర్వాత ఇమామ్‌ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉంటే గత జుమా నుండి ఆ జుమా వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి”. (బుఖారీ – 843)
3) మంచి దుస్తులు ధరించడం.
4) గోళ్ళు కత్తిరించడం, ఎంట్రుకలు సవరించుకోవడం.
5) తొందరగా మస్జిద్‌కు బయలుదేరడం.

హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం: దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ఎవరయితే జుమా రోజు లైంగిక అశుద్ధావస్థ నుండి పరిశుద్ధత పొందడానికి చేస్తున్నంత చక్కగా స్నానం చేసి జుమా నమాజు చదవడానికి ప్రధమ సమయంలో వెళతాడో అతడు ఒక ఒంటెను ఖుర్బానీ ఇచ్చినట్లు. ద్వితీయ సమయంలో వెళ్ళిన వ్యక్తి ఒక ఆవును ఖుర్బానీ ఇచ్చినట్లు. త్వితీయ సమయంలో వెళ్ళిన వ్యక్తి కొమ్ములు తిరిగిన పొట్టేలును ఖుర్బానీ ఇచ్చినట్లు. నాల్గవ వేళలో వెళ్ళిన వ్యక్తి ఒక కోడిని ఖుర్బానీ ఇచ్చినట్లు. ఐదవ సమయంలో వెళ్ళిన వ్యక్తి ఒక గ్రుడ్డును దానం చేసినట్లు. ఆ తర్వాత ఇమాము (ఖుత్బా ఇవ్వడానికి) బయలుదేరి రాగానే దైవదూతలు (హాజరు వేయడం ఆపి) హితోపదేశం వినడానికి మస్జిద్‌లోకి వచ్చేస్తారు”. (బుఖారీ – 841, ముస్లిం – 850)

6) మస్జిద్‌లో ప్రవేశించినప్పుడు రెండు రకాతులు నమాజ్‌ చేసుకోవాలి:

హజ్రత్‌ జాబిర్‌ (ర) గారి కథనం – దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”మీలోని ఒకరు జుమా నమాజు కోసం వచ్చినప్పుడు ఇమామ్‌ ప్రసంగిస్తుంటే, రెండు రకాతులు చదువుకోవాలి, వాటిని తెలికపాటివిగా చేసుకోవాలి”.(ముస్లిం-875)
ఈ అనుమతి ఇమామ్‌ తన ప్రసంగాన్ని ముగిసే సమయంలో అయితే ఉండదు, అతను ఫర్జ్‌ నమాజు కోసం వేచి చూడాలి. అతను ఒకవేళ కూర్చుంటే కూర్చున్న తర్వాత లేచి చదివిన నమాజు ఆమోదయోగ్యం కాజాలదు. కూర్చున్న వ్యక్తి మౌనంగా ఖుత్బాను శ్రద్ధగా వినాలి అంతే.

7) రెండు ఖుత్బాల కోసం మౌనం:
హజ్రత్‌ అబూ హురైరా (ర) గారి కథనం – దైవ ప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”జుమా రోజున ఇమామ్‌ ఖుత్బా ఇచ్చే సమయంలో నీవు నీ సోదరుణ్ణి ఊరుకో అని చెప్పినా అది అనవసర చర్యగా భావించబడుతుంది”.
(బుఖారీ-82,ముస్లిం-851)
జుమా దిన మర్యాదలు
1) సూరయె కహఫ్‌ పారాయణం

2) ఆ పగలు రాత్రి అత్యధికంగా దుఆ చేయడం.

దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”జుమా రోజు ఒక ఘడియ ఉంది. ఆ ఘడియలో విశ్వాసి నిలబడి నమాజు చేస్తూ – అల్లాహ్‌తో ఏదయినా కోరితే అది అతనికి అనుగ్రహించబడుతుంది”. (బుఖారీ- 852)

1) జుమా రేయింబవళ్ళలో దైవప్రవక్త (స) వారి మీద అత్యధికంగా దరూద్‌ పంపాలి:

దైవప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”మీ రోజులలో అత్యంత శ్రేష్ఠమైన రోజు శుక్రవారం. కనుక మీరు ఆ రోజు అత్యధికంగా నాపై దరూద్‌ పంపించండి. నిస్సందేహంగా మీరు పంపే దరూద్‌ నాకు చేరవేయబడుతుంది”. (అబూ దావూద్‌-1047)

పరీక్ష – 19
సరైన సమాధానాన్ని ఎన్నుకోండి

1) జుమా నమాజు కోసం వెళ్ళ దలచుకున్న వ్యక్తి గుసుల్‌ ……………………..గా భావించబడుతుంది.
అ) ఫర్జ్‌
ఆ) ముబాహ్
ఇ) సున్నత్‌
2) నమాజీల కోసం స్థలం సరిపడక పోతే అట్టి స్థితిలో రెండు జమాతులుగా నమాజు చేసుకునే………….
అ) అనుమతి ఉంటుంది.
ఆ) అనుమతి ఉండదు.
3) అబ్దుర్రహ్మాన్‌ అనే వ్యక్తి ఇమామ్‌ మొదటి ఖుత్బా ఇస్తుండగా వచ్చి రెండు రకాతులు నమాజు చేసి తర్వాత కూర్చున్నాడు. అతనికి అనుమతి…
అ) ఉంది.
ఆ) లేదు.
4) జుమా రోజు సూరతుల్‌ కహఫ్‌ చదవడం పురుషుల కోసం………………స్త్రీల కోసం ………..
అ) ఫర్జ్‌ – ఫర్జ్‌
ఆ) సున్నత్‌ – సున్నత్‌
ఇ) ఫర్జ్‌ – సున్నత్‌

5) ఒకే పట్టణంలో ఏ కారణం లేకుండా అనేక జుమా నమాజులు నిర్వహించబడితే వాటిలో మొదట ఏ నమాజు ముగిస్తుందో అది నెరవేరినట్లు మిగతావన్నీ నెరవేరనట్లుగా భావించబడుతోంది.
అ) అవును
ఆ) కాదు.
6) ఖుత్బా ఇచ్చే సమయంలో ఇమాము వీలయినంత వరకు నిలబడాలి.
అ) అవును
ఆ) కాదు.
7) జుమా నమాజు సామూహికంగా చేయడం విధి.
అ) అవును.
ఆ) కాదు.
8) జుమా నమాజును ఆలస్యం చేసి మగ్రిబ్‌ నమాజుకు ముందు కూడా చదువుకోవచ్చు.
అ) అవును
ఆ) కాదు.
9) జుమా ఖుత్బా జుమా నమాజుకన్నా ముందు నిర్వహించాలి.
అ) అవును
ఆ) కాదు.

Related Post