రక్తానుబంధం రక్షానుబంధంగా మారాలంటే…

రక్తానుబంధం రక్షానుబంధంగా మారాలంటే…

శుభకరుడు, గొప్ప గుణగనుడు, కరుణఘణఘనుడు అల్లాహ్  ఇలా సెలవిచ్చాడు:

మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ద్వారా సృష్టించాడు. అదేప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు. తిరిగి వారిరువురి నుండి కోటానుకోట్ల మంది స్త్రీపురుషుల్ని ప్రపంచంలో విస్తరింపజేశాడు. మీరు ఒకరిద్వారా మరొకరు తమ అవసరాలు గడుపుకోవడానికి దేవుని పేరును ఒక సాధనంగా చేసుకుంటారు. అలాంటి దేవునికి భయపడండి. రక్త సంబంధీకులతో మీకు ఏర్పడివున్న సహజ బాంధవ్యాన్ని తెంచకండి. అల్లాహ్  మీ చర్యల్ని గమనిస్తు న్నాడన్న సంగతి మరచిపోకండి. (సూరతున్ నిసా: 1)

బంధువుల పట్ల మంచిగా మెలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనికి భిన్నంగా బంధువుల హక్కుల్ని నెరవేర్చకుండా వారితో సత్సంబంధాలు కొనసాగించటానికి నిరాకరించటం దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. ఈ హదీసు కూడా బంధుప్రేమను గురించి తాకీదు చేస్తోంది.

బంధుత్వాలు బహు భారమైన రోజులివి!  అన్నదమ్ములు, తండ్రితనయులు ..అన్ని బంధుత్వాలు, రక్త సంభంధాలు గాలిలో కొట్టుకు పోతున్నాయి!! ఆస్తి పాస్తుల పేర్లతో ,కలహాలతో..రక్తపాతాన్ని.. చవి చూస్తున్నాయి!! ఒకే రక్తం –  ప్రేమకు బదులు ద్వేషాన్నే రగిలిస్తున్నాయి..!! తీపి చుట్టరికాలు చేదు గుళికలై సహించరానివిగా పరిణమిస్తున్నాయి!! పలకరించుకోవడం..గగనమై..కలహించుకునడం.. నిత్య గుణమైంది.. బంధువులే  పీక్కు తినే రాబందువులు..అయిన కాలమిది!!

సమాచార, సాంకేతిక విప్ల వం ఈ విశాల ప్రపంచాన్ని చిన్న గదిగా మార్చేసింది. దేశవిదేశాల మధ్య గల వేల మైళ్ల దూరాన్ని చెరిపేసి వారిని నిమిషాల్లో కలిపే పరికరాలు సహజంగానే అందరికీ అందుబాటులో ఉన్నాయి. అయినా దూరాలు తగ్గడం అలా ఉంచితే మరింత పెరుగుతున్నా యి. మానవ సంబంధాలు మెరుగవుతూ కన్పించినా కుటుంబ సంబంధాలు కుంటు పడుతున్నాయి. ఒకరి మాట ఒకరికి నచ్చడం లేదు. ఒకరి ఉనికిని ఒకరు సహించడంలేదు. విత్తునాటి చెట్టు పెంచితే… చెట్టు పెరిగి పళ్ళు పంచితే… తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మినట్టే… నేడు కన్నవారి యెడల వ్యవహరాయించడం జరుగుతుంది.  ఆకుచాటు పిందె ముద్దు.  తల్లిచాటు బిడ్డ ముద్దు.  బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు.  ఉగ్గుపోసి ఊసు నేర్పితే… చేయిబట్టి నడక నేర్పితే… పరుగు తీసి పారిపోయే ..  చేయిమార్చి చిందులేసే.. కర్కశులైన కొడుకులను కూతుళ్లను ఏమనాలి?

బంధువులు మూడు రకాలు

1) ఎవరు ఎలా ఉన్నా తాము మాత్రం అందరితో  మంచిగా ఉంటారు.

2) ఎదుటివారు బాగుంటే వీరూ బాగుంటారు. హానీ అయితే చేయరు.

3) పరిస్థితులు అనుకూలించినా, ప్రతికూలించినా అందరి వెనకాల  గోతులు త్రవ్వుతూనే ఉంటారు. వీళ్ళను బంధువులు అనడం కన్నా రాబంధువులు అనడం సబబేమో.  చిన్న పెద్ద ప్రతి విషయానికి పొడుచుకు తింటూ ఉంటారు.

బంధువులెవరయినా అనుచితంగా ప్రవర్తిస్తూ బంధుత్వాలు తెగతెంపులకు పాల్పడినప్పటికీ బంధుత్వ హక్కులను నిర్వర్తించటంలోగాని, వారితో సత్సంబంధాలు పెట్టుకోవటంలోగాని తమ తరపునుంచి ఎలాంటి లోటూ రానివ్వకూడదు. ‘బంధుప్రేమ’ అంటే ఇదే. ఇస్లామీయ షరీఅత్లో బంధుప్రేమకు ఎంతో ప్రాముఖ్యముంది. బంధువుల పట్ల మంచిగా మెలగాలని ఇస్లాం తాకీదు చేస్తోంది. తండ్రి తరపు బంధువులు, తల్లి తరపు బంధువులు ఇరువర్గాలవారూ బంధువుల క్రిందికే వస్తారు. వారందరితోనూ సద్భావంతో మెలగటం చాలా అవసరం.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం ప్రకారం దైవప్రవక్త (సల్లం) ఇలా తెలియజేశారు : దేవుడు సమస్త సృష్టిరాసుల్ని సృష్టించిన తరువాత ‘బంధుత్వం’ లేచి నిలబడి “(దేవా!) నేను బంధుత్వాల తెగత్రెంపుల బారినుండి నీ శరణు కోరుకుంటున్నాను” అని అంది. దానికి “అయితే నీతో సత్సంబంధాలు పెట్టుకున్న వాడితో నేనూ సత్సంబంధాలు పెట్టుకుంటాను. నీతో తెగ త్రెంపులు చేసుకున్నవాడితో నేనూ తెగతెంపులు చేసుకుంటాను, ఇది నీకిష్టమే కదా!” అని అడిగాడు దేవుడు. దానికి బంధుత్వం “ఇష్టమే ప్రభూ!” అని అంది. అప్పుడు అల్లాహ్  “సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది” అని అన్నాడు.

ఈ విషయం గురించి మీకు ప్రమాణం కావాలనుకుంటే దివ్య ఖుర్ఆన్లోని ఈ వాక్యాలు చదువుకోండి. “ఒకవేళ మీరు విముఖులైపోతే భూమి పై ఊ తేడా : క్రమము పేరు ఆని మళ్ళీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు. పరస్పరం బంధుత్వాల తెగత్రెంపులు చేసుకుంటారు. అల్లాహ్ శపించింది, అంధులుగానూ, బధిరులుగానూ చేసింది ఇలాంటి వారినే.” (ముహ మ్మద్ : 22, 23) (బుఖారీ – ముస్లిం)

బంధం బల పడితేనే అందం

హజ్రత్ అబూ హురైరా (రజి) గారి  కథనం – దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రబోధించారు: అల్లాహ్ ను,  అంతిమదినాన్ని విశ్వసించే వ్యక్తి తన (ఇంటికొచ్చిన అతిథిని గౌరవించాలి. అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి తన బంధువులతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. అల్లాహ్ ను అంతిమ దినాన్ని విశ్వసించే వ్యక్తి పలికితే మంచి మాటే పలకాలి లేదా మౌనం వహిం చాలి.” (బుఖారీ – ముస్లిం)

బంధువుల పట్ల మంచిగా మెలిగితే దేవుడు కూడా సంతోషిస్తాడు. దీనికి భిన్నంగా బంధువుల హక్కుల్ని నెరవేర్చకుండా వారితో సత్సంబంధాలు కొనసాగించటానికి నిరాకరించటం దైవాగ్రహానికి కారణభూతమవుతుంది. ఈ హదీసు కూడా బంధుప్రేమను గురించి తాకీదు చేస్తోంది.

కుమారులు లేక కుమార్తెలు చూపే సత్ప్రవర్తనకు తండ్రికన్నా తల్లి మూడు రెట్లు ఎక్కువ హక్కుదారు అవుతుందని తెలుస్తోంది. దీనికి స్త్రీ శారీరక బలహీనత ఒక కారణం కావచ్చు. ఈ శారీరక బలహీనత కారణంగా తల్లి తన సంతానంపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తుంది. రెండో విషయం ఏమిటంటే తల్లి తన సంతానం కోసం మూడు దుర్భరమైన కష్టాలను భరిస్తుంది. ఈ కష్టాల్లో తండ్రి ఏ విధంగానూ పాలుపంచుకోడు. 1. తొమ్మిది మాసాలపాటు తల్లి బిడ్డను తన కడుపున మోస్తుంది. 2. జీవన్మరణాల సమస్య వంటి ప్రసవవేదనను భరిస్తుంది. 3. ప్రసవించిన తరువాత రెండు సంవత్సరాల పాటు బిడ్డకు పాలిస్తుంది. ఈ కష్టాలవల్ల రాత్రిళ్ళు ఆమె నిద్రపాడవుతుంది. ఆమె సౌందర్యం కళావిహీనమై పోయి ఆరోగ్యం దెబ్బతింటుంది. బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఒక్కోసారి ఆమెకు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఎడతెరిపి లేకుండా ఇన్ని కష్టాలు, బాధలు భరించాల్సి వస్తుంది. కనుకనే ఇస్లాం ధర్మం తల్లికి ఎంతో ఉన్నత స్థానాన్ని ప్రసాదించింది.

“నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతోవ్యవహరించండి. ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా ‘ఛీ’ అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారిముందు నినమ్రులై ఉండండి. ఇంకా, “ప్రభూ! బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు, నీవు వారిపై కరుణ జూపు” అంటూ ప్రార్థిస్తూ ఉండండ.”         (అల్ ఇస్రా: 33, 34)

ఇంకొకచోట ఇలా అన్నాడు:

“మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (ఇందుకే మేము అతనికి) “నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లి దండ్రులకు కృతజ్ఞతలు తెలుపు (అని ఉపదేశించాము.)” (లుఖ్మాన్ : 14)

హజ్రత్ అబూ హురైరా (రజి) గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి దైవప్రవక్త (స) దగ్గరికి వచ్చి, “దైవప్రవక్తా! నా సత్ప్రవర్తనకు అందరికన్నా ఎక్కువ హక్కుదారులెవరు?” అని అడిగాడు. దానికి ఆయన “నీ తల్లి” అని చెప్పారు. “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడా వ్యక్తి. దానికి ఆయన ‘నీ తల్లి’ అనే చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ, “ఆ తరువాత ఎవరు?” అని అడిగాడు. అప్పుడు శ్రీప వ కూడా “నీ తల్లి” అనే చెప్పారు దైవప్రవక్త (స). ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు “ఆ తరువాత ఎవరు?” అని. అప్పుడు ఆయన ‘నీ తండ్రి’ అని చెప్పారు. (బుఖారీ – ముస్లిం)

వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది: “దైవ ప్రవక్తా! నా సత్ప్రవర్తనకు ఎవరెక్కువ హక్కుదారులు?” అని ఆ వ్యక్తి అడగ్గా “నీ తల్లి. ఆ తరువాత నీ తల్లే. ఆ తరువాత కూడా నీ తల్లే. ఆ తరువాత నీ తండ్రి. తరువాత నీకు ఎవరెంత దగ్గరి వారయితే వారు” ఆయన చెప్పారు.

రక్తసంబంధీకులు ఎవరు?

దైవగ్రంథం ప్రకారం రక్తసంబంధీకులే ఒకరి కొకరు ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాహ్  ప్రతి విషయాన్నీ ఎరిగినవాడు.(అన్ఫాల్ : 74-75)

రక్త సంబంధం అంటే, తల్లి వైపు మరియు తండ్రి వైపు బంధువులు. అంటే వారి తండ్రులు, తల్లులు, తాతలు మరియు అమ్మమ్మలు మొదలయినవారు.

కొడుకులు, కూతుళ్లు  వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు మొదలయినవారు.

అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు మరియు వారి పిల్లలు,  వారి పిల్లల పిల్లలు మొదలయినవారు.

మామలు, అత్తలు, మామలు, మేనత్తలు మరియు వారి పిల్లలు మొదలయినవారు.

బంధాన్ని బలపర్చడం ఎలా?

  1. దూరమయిన వారికి దగ్గరవ్వడం:

బంధువులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారన్న నెపంతో తాము కూడా వారితో బంధుత్వాన్ని త్రెంచుకోవటం భావ్యం కాదు. ఎందుకంటే ఇస్లాంలో ఇతర బంధువులు తమకు అపకారం తలపెట్టినప్పటికీ తాము మాత్రం వారితో ఉపకార భావంతోనే మెలగాలని తాకీదు చేయబడింది. బంధువులతో ఎల్లప్పుడూ మంచిగా మెలిగేవాడు దేవుని దృష్టిలో అత్యంత గౌరవనీయుడిగా, ఆదరణీయుడిగా పరిగణించబడతాడు. అలాంటి వ్యక్తి కోసం దైవం ఆకాశాల నుండి ప్రత్యేక సహాయకులను పంపుతాడు.

హజ్రత్ అబూ హురైరా (రజి) గారే చేసిన కథనం : ఒక వ్యక్తి దైవప్రవక్త (స) వద్దకు వచ్చి, “దైవప్రవక్తా! నా బంధువులు కొందరున్నారు. నేను వారితో సత్సంబంధాలు కొనసాగించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారు మాత్రం నాతో తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నారు. నేను వారిపట్ల మంచిగా మెలగుతుంటే వారేమో నాకు కీడు తలపెడుతున్నారు. నేను వారిపట్ల ఉదారవైఖరిని అనుసరిస్తుంటే వారు మాత్రం నాపట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు” అని దైవప్రవక్తకు తన గోడు వినిపించుకున్నాడు. అతని మాటలు విని ఆయన, ‘నువ్వు చెప్పింది నిజమే అయితే నువ్వు వారి నోళ్ళల్లో వేడిబూడిదను పోస్తున్నావనుకో. నువ్వు మాత్రం వారిపట్ల ఇలాగే సత్ప్రవర్తనతో మెలగుతున్నంతకాలం దేవుని తరఫు నుండి వారికి వ్యతిరేకంగా ఒక సహాయ కుడు నీ వెంట ఉంటాడు” అని అన్నారు. (ముస్లిం)

హెచ్చరిక: దీనికి భిన్నంగా బంధుత్వ తెగతెంపులకు పాల్పడేవాడు దేవుని దృష్టిలో అత్యంత నీచుడిగా పరిగణించబడతాడు. అతని పర్యవసానం కూడా కాలుతున్న బూడిద తింటున్న వాడి మాదిరిగా అత్యంత హీనంగా ఉంటుంది. దైవప్రవక్త (సల్లం) పై హదీసులో  ఇచ్చిన ఈ ఉదాహరణలోని ఆంతర్యం ఏమిటంటే, కాలుతున్న బూడిద తింటున్నవాడికి నోరు కాలినట్లే బంధుత్వాల తెగ త్రెంపులకు పాల్పడుతున్నవాడి పాపం కూడా పండుతూ ఉంటుంది. అయితే వారిపట్ల మంచిగా మెలగుతున్న వ్యక్తి మాత్రం నిందార్హుడు కాడు. అతని హక్కుల్ని కాలరాసి, అతణ్ణి బాధపెడుతున్నందుకు బంధువిచ్ఛిత్తికి పాల్పడిన వారే మహాపరాధులుగా పరిగణించ బడతారు

2) ద్వేషించిన వారిని ప్రేమించడం:

హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర (రజి) గారే చేసిన కథనం ప్రకారం – దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు: ఒక బంధువు ఉపకారం చేస్తే దానికి బదులుగా ఉపకారం చేసేవాడు (నిజ మైన) బంధుప్రియుడు కాడు. తన బంధువులు తనతో తెగత్రెంపులు చేసుకున్నప్పటికీ వారితో సత్సంబంధాలు కొనసాగించేవాడే (సిసలైన) బంధు ప్రియుడు. (బుఖారీ)

బంధుప్రేమ బంధువుల మధ్య ఎలాంటి సద్భావనను, సదభిప్రాయాన్ని కోరుకుంటుందో ఈ హదీసు వివరిస్తోంది. తమకు ఉపకారం చేసే బంధువులకు ఉపకారం చేయడంలో గొప్పేముంది? అది బంధుప్రేమ కాదు. ఒక ఉపకారికి ఉపకారం చేసినట్లవుతుంది అంతే! తోటి బంధువులెవరైనా తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, తమతో బంధుత్వాన్ని త్రెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తాము మాత్రం విశాల హృదయంతో వారిని మన్నిస్తూ, వారి కీడుకు బదులుగా మేలు చేసి తమ ఉదారత్వాన్ని ప్రదర్శించాలి. వారితో బంధుత్వ సంబంధాలను కొనసాగించడానికి ముందుకు రావాలి. అసలు సిసలైన బంధుప్రేమ అంటే ఇది! ఇస్లాం కోరేది కూడా ఇలాంటి బంధుప్రేమనే! ఇతరులు మనల్ని నీచంగా చూసినప్పుడు మనం వారిపట్ల సద్భావంతో మెలగటానికి అహం అడొస్తుంది. కాని ఆ అహంభావాన్ని అణచుకొని షరీఅత్ ఆదేశాల్ని పాటించాలి. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. మరోవైపు పరిపూర్ణ విశ్వాసాన్ని పొందాలంటే మనసులోని అహంభావాన్ని అణచుకోక తప్పదు.

3)బంధువుల యెడల దాతృత్వం

దానధర్మాలు చేసినప్పుడు ముందుగా తమ సన్నిహిత బంధువులను దృష్టిలో పెట్టుకోవాలి. వారు అవసరాల్లో ఉన్నారనుకుంటే వారికే ఇవ్వాలి. ఆ తరువాత కూడా సదఖా సొమ్ము మిగిలి ఉంటే దానిని ఇతరులకు కూడా దానం చేయవచ్చు. దీనికి భిన్నంగా ఇతరులను సుఖపెట్టి సొంత బంధువులనే విస్మరించటం ఎంతమాత్రం వాంఛనీయం కాదు.

హజ్రత్ అనస్ (రజి) గారు  చేసిన కథనం : మదీనా నగరంలోని అన్సార్ ముస్లింలందరిలో హజ్రత్ అబూ తల్షా (రజి) గొప్ప ధనికులు. ఆయనకు అనేక ఖర్జూర తోటలుండేవి. ఆ తోటల్లో ఆయనకు ‘బైరహా’ తోట అంటే ఎంతో యిష్టం. అది మస్జిద్ నబవీకి ముందు భాగంలో ఉండేది. దైవప్రవక్త (స) తరచూ ఆ తోటలోకి వెళుతుండేవారు. అక్కడ దొరికే మంచినీళ్ళు త్రాగేవారు. ఆ కాలంలోనే –

“మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకు మీరు సత్కార్యస్థాయికి చేరుకోలేరు” అనే దైవసూక్తి (ఆలి ఇమ్రాన్ : 92)  అవతరించింది.

ఈ సూక్తి అవతరించినప్పుడు  హజ్రత్ అబూ తల్హా (రజి) దైవప్రవక్త ముందు ఇలా ప్రకటించారు: “దైవప్రవక్తా! మీరు అమితంగా ప్రేమించే వస్తువులను (తన మార్గంలో) ఖర్చుపెట్టనంతవరకు మీరు సత్కార్య స్థాయికి చేరుకోలేరని దేవుడంటున్నాడు. అలాగైతే నాకున్న సంపద మొత్తంలో బైరహా తోట నాకు అత్యంత ప్రీతికర మైనది. దాన్ని నేను దైవమార్గంలో దానం చేస్తున్నాను. దానివల్ల నాకు పుణ్యం లభిస్తుందని, ఇంకా పరలోకంలోనూ దాని పుణ్యం నాకోసం నిల్వచేసి ఉంచ బడుతుందని ఆశిస్తున్నాను. దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తే అలా మీరు దీనిని వినియోగించండి.” ఆయన మాటలు విని దైవప్రవక్త (స) “ఓహో! ఇదెంతో లాభదాయకమైన సంపదే. నిజంగా ఇదెంతో లాభదాయక మైన సంపద. నువ్వు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను. అయితే నువ్వు ఈ సంపదను (అభాగ్యులైన) నీ బంధువు లకు పంచిపెడితే సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను” అని అన్నారు. దానికి హజ్రత్ అబూ తల్హా (రజి) “మీరు చెప్పినట్లే చేస్తాను దైవప్రవక్తా!” అని అన్నారు. (ఆ తరువాత దైవప్రవక్త సలహాననుసరించి) ఆయన ఆ తోటను తన బంధువులకు, చిన్నాన్న, పెద్దనాన్న కుమారులకు పంచివేశారు.’ (బుఖారీ – ముస్లిం)

4) వారి వీపు వెనకాల వారి కోసం  దుఆ చేయడం:

దైవప్రవక్త (సల్లం) ఇలా ప్రవచించారు:  “తన ముందర లేని  తన సోదరుడి కోసం ఒక ముస్లిం చేసిన దుఆ స్వీకరించబడుతుంది.  అతనిపై ఒక ప్రతినిధి ధైవదూత ఉంటాడు; అతను తన సోదరుడికి మంచి కోసం ప్రార్థించినప్పుడల్లా, ప్రతినిధి దైవ దూత  ఆమీన్  అంటాడు. మరియు నీ  కోసం కూడా  అని దీవిస్తాడు”.    (ముస్లిం),

5)   పండితుల సలహా

ఇమామ్ అల్-నవవి (రహ్మ) ఇలా అభిప్రాయపడ్డారు:   “బంధుత్వ సంబంధాలను నిలబెట్టడం అనేది  వ్యక్తిని బట్టి ఉండాలి.   – కొని సార్లు దయగా ఉండటం. కొన్నిసార్లు ధన సహాయం  ద్వారా, కొన్నిసార్లు సేవ ద్వారా, మరియు కొన్నిసార్లు సందర్శించడం ద్వారా, ఏవైనా శుభ సందర్భాలు ఉంతే  శుభాకాంక్షలు తెలుపడం ద్వారా.

ఇమామ్ ఖుర్తుబీ ఇలా అభిప్రాయం పడ్డారు;  బల పర్చాల్సిన చేరిన సంబంధాలు రెండు విధాలు. సాధారణమైనవి మరియు నిర్దిష్టమైనవి, 1) సాధారణమైన బంధం : ఎదుటి వ్యక్తి శ్రేయాన్ని కోరుకోవడం,  పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండటం.  సలహా, సంప్రతింపులు జరపడం.  అందరి యెడల  న్యాయంగా వ్యవహరించడం,  సిఫార్సు చేయడం,  ఇతరుల  హక్కులను నెరవేర్చడం ద్వారా కొనసాగించాలి.

2) నిర్దిష్టమైన బంధం:  ఆర్థికంగా వారిని ఆదుకోవడం,  వారి స్థితిగతులను, మంచీచెబ్బరలను అడిగి తెలుసుకోవడం,   వారి పొరపాటలను,  తప్పులను పెద్ద మనసుతో క్షమించడం.

3) షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహ్మ) ఇలా అన్నారు: చరవాణి ద్వారా యోగక్షేమాలు తెలుసుకోవడంకూడా బంధుత్వ సంబంధాలను నిలబెట్టుకోవడంలో భాగమే. వీడియో కాలింగ్, చాటింగ్, మెసేజ్  అన్నీ బంధాలను బాల పరచడమే అవుతుంది.

6) మంచిని గురించి ఆదేశించడం

”మన్‌ దల్ల అలా ఖైరిన్‌ ఫలహు క అజ్రి ఫాయిలిహి” – మంచికి మార్గం చూపిన వ్యక్తి మంచి చేసే వ్యక్తి లభించినంత పుణ్యం లభిస్తుంది అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). (ముస్లిం)

మంచి చెయడానికి మనం పండితులం కానవసరం లేదు. మంచి మనసున్న మనుషులమయితే చాలు. నిజంగా మంచి చేయాలన్న సద్బుద్ధి కలగడమే గొప్ప విషయం. కాబట్టి   అలాంటి  గొప్ప ఆలోచన వచ్చినప్పుడు గోరంతి ఆలస్యం కొండంతి నష్టానికి దారి తీయగలదన్న స్ప్రుహతో  మంచి చేసెయ్యాలి.

7) చెడును గురించి వారించడం

హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం : “(ప్రవక్తా!) నీ దగ్గరి బంధువు లను భయపెట్టు” అన్న దివ్య ఖుర్ఆన్ సూక్తి (అష్ షూరా : 214) అవతరించి నప్పుడు దైవప్రవక్త (సల్లం) ఖురైషు లందరినీ పిలిచారు. దాంతో (ఖురైష్ తెగకు చెందిన) సామాన్యులు, ప్రముఖు

లందరూ ఒకచోట సమావేశమయ్యారు. అప్పుడు ఆయన తన తెగవారికి దైవ సందేశాన్ని అందజేస్తూ ఇలా అన్నారు

“ఓ అబ్ద్ షమ్స్ వంశీయులారా! ఓ కాబ్ లుఅయ్యి వంశీయులారా! మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి కాపాడుకోండి. హాషిం వంశీయులారా! మిమ్మల్ని మీరు నరకాగ్ని బారినుండి కాపాడుకోండి. అబ్దుల్ ముత్తలిబ్ వంశీయులారా! మిమ్మల్ని మీరు

నరకాగ్ని బారినుండి రక్షించుకోండి. ఓ ఫాతిమా! నిన్ను నీవు నరకజ్వాలల నుంచి కాపాడుకో. ఎందుకంటే దైవశిక్ష నుండి మిమ్మల్ని కాపాడటానికి నాకు ఎలాంటి అధికారం లేదు. అయితే మీకు నాతో బంధుత్వం ఉంది కనుక (ఇహలోకంలో ఉన్నంతకాలం) బంధుత్వ సంబంధాలను మాత్రం కొనసాగిస్తాను.” (ముస్లిం)

8) బంధాన్ని బలపర్చమని ప్రోత్సహించడం

దైవప్రవక్త (స)  ఇలా ప్రవచించారు:  అల్లాహ్  మరియు ఆయన వదూతలు మరియు భూ ఆకాశ వాసులు, చివరికి రంధ్రంలోని చీమ,సముద్రంలోని  చేప  కూడా – ప్రజలకు  మంచిని బోధించే  గురువును ఆశీర్వదిస్తారు”

9) సంధి కుదర్చడం

సాధారణంగా ప్రజలు జరిపే రహస్య మంతనాలలో ఎలాంటి శ్రేయస్సు ఉండదు. అయితే దానధర్మాలను గురించి రహస్యంగా ఏదైనా హితోపదేశం చేస్తే లేదా మరేదైనా సత్కార్యం చేయడానికో లేక ప్రజల వ్వవహారాలు చక్కదిద్దడానికో ఎవరితో ఏదైనా అంటే అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. అది మంచి విషయమే. ఎవరైనా దేవుని ప్రసన్నత కోసం ఇలా చేస్తే మేమతనికి గొప్ప ప్రతిఫలం ప్రసాదిస్తాము. (అన్నిసా: 114)

వేరొకచోట అల్లాహ్ ఇలా అంటున్నాడు: “ఏది ఏమైనా(భార్యాభర్తల మధ్య) సర్దుబాటే అన్ని విధాలా ఉత్తమమైనది.” (అన్ విసా : 128)

“మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి.” (అల్ అన్ఫాల్ : 1)

ఆయన ఇంకా ఇలా సెలవిస్తున్నాడు: “విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరిం చండి.” (అల్ హుజురాత్ : 10)

ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే (ఉద్దేశ్యంతో వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడేవాడు అబద్ధాలకోరు కాజాలడు. (ఒకరి నుండి మరొకరికి) మంచి మాటలే చేరవేస్తాడు. ఏది చెప్పినా మంచి ఉద్దేశ్యంతోనే చెబుతాడు. అన్నారు ప్రవక్త (స) . (బుఖారీ- ముస్లిం)

ఉమ్మె కుల్సూమ్ అంటున్నారు దైవప్రవక్త (సల్లం) ప్రజలకు మూడు విషయాల్లో తప్ప మరే విషయంలోనూ వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినట్లు నేను వినలేదు. ఆ మూడు విషయాలు ఇవి: యుద్ధంలో, ప్రజల మధ్య సంబంధాలను చక్కదిద్దే సమయంలో, మనిషి తన భార్యతోగానిభార్య తన భర్తతోగాని (పరస్పరం సంతోషపెట్టే ఉద్దేశ్యంతో) సంభాషించుకున్నప్పుడు. (ముస్లిం)

10) అవిశ్వాస బంధువులతో ఉత్తమంగా మసలుకోవాలి

హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజి) కుమార్తె అస్మా (రజి. అన్ హా) కథనం : దైవప్రవక్త(కు మరియు మక్కా బహు దైవారాధకులకు మధ్య జరిగిన హుదైబియా ఒప్పంద) కాలంలో ఒకసారి మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా బహుదైవారాధకురాలిగానే ఉంది. నేను ఆమె వచ్చిన సంగతి దైవప్రవక్త (సల్లం) ముందు ప్రస్తావిస్తూ “దైవప్రవక్తా! మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఉంది. ఆమె నా నుండి సద్వర్తనను ఆశిస్తోంది. మరి నేను (బహుదైవారాధకురాలైన) మా అమ్మ పట్ల మంచిగా మెలగవచ్చా?” అని అడిగాను. అందుకాయన “అవును, నువ్వు మీ అమ్మ పట్ల (తప్పకుండా) సత్ప్రవర్తనతో మెలగాలి” అని అన్నారు. (బుఖారీ – ముస్లిం)

బంధువులు బహుదైవారాధకులైనా, దైవతిరస్కారులైనా సరే వారితో సత్సంబంధాలు కొనసాగించటంలో మాత్రం ఎలాంటి లోటు రానీయకూడదు.. వారి హక్కుల్ని నిర్వర్తిస్తూ ఉండాలి. వారికున్న ప్రప్రథమ హక్కు ఏమిటంటే వారికి విశ్వాసాన్ని, సదాచరణను బోధించి పరలోకంలో వారిని నరకాగ్ని బారినుంచి కాపాడాలి.

దైవప్రవక్త (స) మెల్లిగా కాకుండా బిగ్గరగా, “ఫలానా తెగవారు నా మిత్రులు కాజాలరు. అల్లాహ్  మరియు సదాచార సంపన్నులైన విశ్వాసులే నా మిత్రులు. అయితే ఆ తెగవారితో నాకు బంధుత్వముంది. కనుక నేను బంధుత్వ సత్సంబంధాలను మాత్రం తప్పకుండా కొనసాగిస్తాను” అని ప్రకటిస్తుండగా తాను విన్నానని హజ్రత్ అబూ అబ్దు ల్లాహ్ అమ్ బిన్ ఆస్ (రజి) తెలియజేశారు. (బుఖారీ – ముస్లిం, వాక్యాలు మాత్రం బుఖారీలోనివి)

బంధుత్వ బంధాన్ని బలపరిస్తే కలిగే లాభాలు

1) స్వర్గ ప్రాప్తి – నరక ముక్తి

ఒక వ్యక్తి  దైవ ప్రవక్త (స) వారిని  స్వర్గంలో ప్రవేశింపజేసే,  నరకం నుండి దూరంగా ఉంచే ఒక కార్యం గురించి తెలుపమని  అడిగాడు: దానికి ఆయన – మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, షిర్క్ చెయ్యకండి, మరియు నమాజు స్థాపించండి,  జకాత్ చెల్లించండి  మరియు కుటుంబ బంధాలను బలపరచండి అని హితవు పలికారు.(ముస్లిం)

2) విశ్వాసం వికసిస్తుంది

అల్లాహ్ ఇలా అంటున్నాడు:

“విశ్వాసులు పరస్పరం సోదరులు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరిం చండి.” (అల్ హుజురాత్ : 10)

3) అల్లాహ్ ఆగ్రహానికి దూరమవుతాము, అల్లాహ్ అనుగ్రహానికి దగ్గరవుతాము

బంధుత్వ సంబంధాల ప్రాముఖ్యత నొక్కి వక్కాణిస్తూ దైవ ప్రవక్త (స) ఇలా అన్నారు: ”అల్లాహ్‌ా సమస్త సృష్టిరాసులను సృష్టించిన తర్వాత ‘బంధుత్వం’ లేచి నిలబడి – ‘(దేవా!) నేను బంధుత్వ సంబంధాల విచ్ఛిన్నం నుండి నీ శరణు వేడుకుంటున్నాను’ అని విన్నవించుకుంది. దానికి ”అయితే నిన్ను బల పర్చిన వాడిని నేనూ బలపరుస్తాను. నీతో తెగత్రెంపు లు చేసుకున్నవాడితో నేనూ తెగత్రెంపులు చేసుకుంటాను, ఇది నీకు ఇష్టమే కదా!” అని అడిగాడు అల్లాహ్‌. దానికి బంధుత్వం ‘ఇష్టమే ప్రభూ!’ అని అంది. అప్పుడు అల్లాహ్‌ా ”సరే ఆ భాగ్యం నీకు దక్కుతుంది” అని దీవిం చాడు. (ముత్తఫఖున్‌ ఆలైహి)

4) ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదల

దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”తన ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదల ను కోరుకునే వ్యక్తి తన బంధువులతో సత్సం బంధాలు పెట్టుకోవాలి”. (బుఖారీ)

5) ఉత్తమ స్థితిలో మరణం

దైవ ప్రవక్త (స) ఇలా ఉపదేశించారు: ”తన ఉపాధిలో సమృద్ధిని, ఆయుష్షులో పెరుగుదలను, మంచి స్థితిలో మరణాన్ని  కోరుకునే వ్యక్తి తన బంధువులతో సత్సం బంధాలు పెట్టుకోవాలి”. (మజ్మవుజ్ జవాబుద్)

బంధుత్వ సంబంధాలు బలంగా లేకపోవడానికి కారణాలు

1) బంధుత్వ సంబంధాల  వల్ల  కలిగే పుణ్యాన్ని  మరియు దానిని తెంచడం వల్ల కలిగే నష్టం గురించి తెలియకపోవడం.

2) ధర్మ అవగాహనా రాహిత్యం

3) అహంకారం

4) పూర్వీకుల అంధానుసారణ – అమ్మా నాన్న శత్రుత్వాన్ని సంతానం వారసత్వంగా కొనసాగించడం.

5) చాలా కాలం  వరకు పలుకరించుకోకపోవడం.

6) తరచూ ఒండొకరిని కలిసి యోగక్షేమాలు తెలుసుకోకపోవడం.

7)  తీవ్ర స్థాయిలో కువిమర్శలకు దిగడం, నిందలు వేయడం.

8) పిసినారితనం, పేరాశ

9) ఆవారానికి మించి ఖర్చు చేయడం

10) వారసత్వపు ఆస్తి పంపకంలో జాప్యం వహించడం

11)  ప్రాపంచిక వ్యామోహం

12) ఆత్మ స్తుతి, స్వీయ ప్రశంస

13) భరించే గుణం లేకపోవడం

14) సందర్శించుకునేంత దగ్గరలో లేకపోవడం

15) ముఖ్యమైన విందుల్లో, శుభ కార్యాల్లో  ఆహ్వానించకపోవడం

16) అనవసరమైన సిగ్గు, మోతాదు మించిన మొహమాటం

17) వచ్చిన బంధువుల్ని సరిగా పట్టించుకోకపోవడం

నేటి  మన స్థితి

ఇంట్లో ఉన్న అత్తగారితో సజావుగా నడుచుకో లేని, సరిగ్గా మాట్లాడని కోడలు ఎక్కడో విదే శాల్లో ఉండే ఫ్రెండ్స్‌తో గంటల తరబడి ముచ్చట్లు చెప్పుకుంటుంది. సమాజ సేవలో ఎంతో మందిని చేరదీసే అత్తగారికి కోడలంటే చిన్న చూపు. చాలా మంది కొత్త పరిచయాల కోసం పడే ఆరాటం, చూపే ఆసక్తి, ఉత్సాహం ఉన్న సంబంధ బాంధవ్యాలు మెరుగు పర్చు కోవడాని కి ప్రయత్నించడం లేదు. నిత్యం కలుసుకునే వ్యక్తులు, స్నేహితులు, రక్త సం బంధీకుల మధ్య ఉండే కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఇంటర్‌నెట్‌లో కలి సిన వ్యక్తుల మధ్య ఉండ టం లేదు. ఆ వ్యక్తు లు కేవలం మాటలు, రాతల ద్వారానే పరిచ యం. వాళ్లు ప్రతక్ష్యం గా కూడా కలిసింది ఉండదు. అయినా వారి మధ్య ఎంతో నమ్మ కం, ఆత్మీయత, ప్రతి బంధం ఇలానే ఉండాలని లేదు. ప్రేమ, నమ్మ కం, మోసం అనేవి వాస్తవ ప్రపంచం, మిథ్యా ప్రపంచం రెండింటిలో సమానంగా ఉన్నాయి.
అంటే ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండ కూడదని కాదు, ప్రాధాన్యత ముందు తన వారికివ్వాలన్నదే. మనం ఇచ్చే ఆ ప్రాధా న్యత దైవాభీ ష్టం ప్రకారం ఉండాలన్నదే. విశ్వ శక్తి చైతన్య మూర్తి,  ఏడేడు లోకాలకె ఇలవేల్పు అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

“మీరంతా అల్లాహ్ ను మాత్రమే  ఆరాధించండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టకండి. తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాధలూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ ఆధీనంలో ఉన్న దాసదాసీజనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి.” (అన్ నిసా : 36)

 

Related Post