నరక కూపం 1

 

నరక కూపం 1 ”మరి ఎవరయితే హద్దులు మీరి ప్రవర్తించి ఐహిక జీవితా నికే ప్రాధాన్యమిచ్చారో వారికి నరకమే నివాసమవు తుంది”.   (నాజిఆత్‌: 37-39)

ఎందరో మరణించారు. మరెందరో మరణ దూత వేయిటింగ్‌ లిస్టు లో ఉన్నారు. మనమందరం ఏదోక రోజు మరణించవలసిన వారమే. మనందరి శ్వాస ఏదోక రోజు ఆగిపోతుంది. మనమే కాదు ఈ పుడ మిపై మనుగడ సాగిస్తున్న ప్రతి ప్రాణికి మరణం ఉంది, ప్రతి వస్తువు కు నాశనం ఉంది. నిన్నటి వరకూ మనతో పాటు ఎందరో పరిచి తులు-అపరిచితులుండేవారు. వారిలో ఒకడు ప్రేమ కావాలనేవాడు, ఒకడు పెళ్ళి కావాలనేవాడు. ఒకడు ఖారూన్‌ అంతటి ఆస్తి ఉండా లని,  బిల్‌గెట్స్‌ అంతటి ఎత్తుకు ఎదగాలనుకునేవాడు. అయితే వీరిలో ఎందరి ఆశలు ఫలించాయో ఎందరి ఆశలు ఆడియాశలయ్యాయో ఆ దేవుడికే ఎరుక. ఏదిఏమయినా అందరి విషయంలో ఆ దేవుని మాట నిజమయింది:

”ప్రతి సముదాయానికి

పరలోక ప్రస్థానం

భార్యాభర్తలెలా సఖ్యతగా మెలగాలనే విషయంపై ఉద్ధండ ఉపన్యశించి ఇంటి కెళ్ళినప్పటి నుండి భార్యతో తిట్ల తాంబూలాలు, కొట్లాటలు. అతనిప్పుడు రక్త కన్నీరు కారుస్తున్నాడు; కాని ఫలితం లేదు.

ఒక గడువు నిర్ణయ మయి ఉంది. ఆ గడువు పూర్తి అయినప్పుడు ఒక్క ఘడియ కాలం కూడా వెనకా ముందూ అవడం అనేది జరగదు”. (ఆరాఫ్‌: 34) మృత్యువు వారిని మెల్లగా తన ఒడిలోకి తీసేసుకుం టుంది…..

మనిషి చనిపోతాడు. పాము కుబుసం వదలి ముందుకు

 

 

సాగిపో యినట్టు ఎంతో నాజుకూగా పెంచుకున్న గారాల దేహాన్ని వీడి మనిషి ఆత్మ పరలోకానికి

 

పయనమవుతుంది. దానికి భౌతిక నేత్రాలయితే లేవుగానీ అది చూడగలుగుతోంది. దానికి మనకులాగు వీనులు లేవు గానీ, అది వినగలుగుతుంది. నరకం ఉందంటే నరలోకాన్నే నాకంలా భావించే కొందరు భ్రమ జీవులు ఎగిరి గంతులేస్తారు. కోపంతో కారాలు మిరియాలు నూరుతారు. సమాధి చేయబడిన శవం మట్టిలో కలిసి మట్టయిపోతుందనుకుంటారు. కాల్చబడిన శవం బూడిదయి కాటి మట్టిలో కలిపోతుందనుకుంటారు. ఐహిక జీవితం తప్ప పర లోక జీవితం లేదన్నది వీరి బలమయిన వాదన. దేహంకన్నా ఆత్మ కున్న ప్రాముఖ్యతను వీరు గమనించేందుకు సుముఖంగా ఉండరు. శరీరానికి మెరుగులు దిద్దుకుంటారేగానీ, ఆత్మను ప్రక్షాళనం చేసుకు నేందుకు ప్రయత్నించరు. దాని గురించి ఆలోచించనన్నా ఆలోచిం చరు. సమాధి యాతన అనేది ఎంత నికృష్టమయినదో, అక్కడికి చేరిన ఆత్మలు ఎంతగా అల్లాడిపోతాయో,  సమాధిలో పుణ్యాత్మలకు లభించే ఫలం ఎంత మధురాతిమధురమయినదో, అవి ఎంతటి సుఖవంత మయిన జీవితాన్ని అక్కడ గడుపుతాయో పూస గుచ్చినట్లు ప్రవక్త (స) వారు చెప్పినా మారని ఈ జనం  నిజంగా సమాధికేగిన ఆత్మ ల్లోని ఏ ఒక్క ఆత్మ అయినా తిరిగి భూవాసుల వద్దకు పోయి వివరించినా మారుతారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే అది వారి అనుభ వంలోనికి రానిది గనక. అయినా అలా జరగడానికి వీలు లేదు. అలా వెళ్ళాలని కోరుకోని వారు ఉండరని కాదు అర్థం; ఉంటారు. కానీ వారికి లభించే సమాధానం ఏమిటి?   ”ఏమిటీ, మేము మట్టిలో కలిసి, మాయమయిపోయిన తర్వాత  కూడా మళ్లీ సరికొత్తగా సృష్టించబడతామా?” అని వారు అంటారు. అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని త్రోసి పుచ్చుతున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”మీపై నియమించ బడివున్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపర్చుకుంటాడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు. అపరాధులు తమ ప్రభువు సమక్షంలో తలలు వంచుకుని ఉండటాన్ని నువ్వు చూస్తే ఎంత బాగుండు! (అప్పుడు వారిలా అంటారు)’మా ప్రభూ! మేమంతా చూసుకున్నాము. (అంతా) వినేశాము. ఇక మమ్మల్ని తిరిగి పంపించు. ఇక నుంచి మేము సత్కార్యాలు మాత్రమే చేస్తాము. మాకిక పూర్తి నమ్మకం కలిగింది.” (అస్సజ్దా: 10-12)

ఒకప్పుడు వారు త్రోసి పుచ్చిన విషయాల్ని ఇప్పుడు కళ్ళారా చూసు కుంటారు. ఒకప్పుడు పరహసించిన వాటిని గురించి ప్రత్యక్షంగా వింటారు. అల్లాహ్‌ా హెచ్చరికలోని వాస్తవికత వారికి బోధ పడతుంది. ప్రవక్తలు (అ) తెలియజేసిందంతా సత్యమని అప్పుడు వారికర్థమవు తుమది. కానీ, ఏం లాభం? కర్మలు చేెసుకోవడానికి వారికివ్వబడిన గడువు తీరిపోయింది. ఇప్పుడు వారి కోసం మిగిలిందల్లా పరాభావం తో కూడిన శిక్షే   వారు ప్రాపంచిక జీవితంలో దైవాన్ని, ఆయన శాస నాల్ని, ఆయన పంపగ వచ్చిన ప్రవక్తల ప్రవచనాల్ని పెడ చెవిన పెట్టారు, ఖాతరు చేయలేదు, విస్మరించారు. కాబట్టి ఈ రోజు అల్లాహ్  కూడా వారి గోడును పట్టించుకోడు.  మనిషి మరణం తర్వాత ఎన్నో మజిలీలు ఉంటాయి. సమాధి పర లోకపు తొలి మజిలీ అయితే మహ్షర్‌ అనే చివరి మజలీలో ఎక్కడి వెళ్ళాలో తీర్పు ఇవ్వబడుతుంది.  ”ఓ బృదం స్వర్గంలో, మరో బృందం నరకంలో”. (షూరా:7)

ఒక సోదరుడేమో ఆటపాటలే జీవితమని తలపోస్తున్నాడు. మరొక మిత్రుడు దైవాదేశాలనకు శిరసావహించడమే, ఆయన్ను ఆరాధించ డమే జీవిత అర్థంగా, పరమార్థంగా భావిస్తున్నాడు.  ఒక సోదరుడేమో అశ్లీల కార్యాల్లో, నీతిమాలిన పనుల్లో ఖర్చు పెట్టేందుకు ధనాన్ని కూడబెడుతున్నాడు. ధనమే మనిషిని నడిపే ఇంధనం అని నమ్ముతు న్నాడు. తనకు ప్రాప్తయిన సిరిసంపదలు కలకాలం ఉంటాయయనీ, వాటి ప్రాతిపదికనే కీర్తిప్రతిష్టతలు ఒనగూడుతాయని భావిస్తున్నాడు. మరొక మిత్రుడు అల్లాహ్  మార్గంలో ఖర్చు పెట్టాలనీ, తల్లిదండ్రుల సేవలు చేయాలని, అనాథలను, నిరుపేదలను, వికలాంగులను, వితం తువులను ఆదుకోవాలనీ, నిస్సహాయులకు, నిరాధార జీవులకు అండ గా నిలవాలనీ, బంధుమిత్రులతో, ఇరుగుపొరుగువారితో సత్సంబం ధాలు పెంపొందించుకోవాలనీ ధర్మం సమ్మతించిన పద్ధతిలో ధనాన్ని అర్జిస్తున్నాడు.  ఒక సోదరుడేమో – విదేశాలకు వెళ్ళి విలాసాల్లో, కులాసాల్లో గడుపు తూ, అక్కడ హాయిని పొందాలని, బులపాటం తీర్చుకోవాలని, మదు పానం మైకంలో మునిగి తేలాలని కోరుకుంటున్నాడు. మరొక మిత్రుడు – హజ్జ్‌-ఉమ్రాల కొరకు మక్కా వెళుతున్నాడు. ఆఫ్రికన్‌ దేశాలలో నివసిస్తూ కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న అభాగ్యుల వద్ద కెళ్ళి రేయింబవళ్ళు వారి సేవలోనే సమయం గడుపుతున్నాడు. దైవాభీష్టానికి అనుగుణంగా జీవించి శ్వాస వదలాలని సుదూర ప్రయాణాలు చేెస్తున్నాడు. ఇలా భిన్న దృక్పథాలు గల ఈ ఇరువురూ సమానులేనా? కారు…ఎన్నటికీ కాలేరు. అవును ఇది అక్షర సత్యం – ”నరకానికి ఆహుతి అయ్యేవారు, స్వర్గానికి పోయేవారు సమానులు కాలేరు”. (హష్ర్‌:11)

నిజ దైవాన్ని గ్రహించి, మిథ్యా దైవాలను విడనాడమని, అయిదు పూటల నమాజు పాటించమని, జకాత్‌ చెల్లించమని, శాంతిని సర్వ వ్యాప్తం చేెయమని, అన్నదానాలు చేపట్టమని మనిషికి పలు విధాలుగా బోధించడం జరిగింది. ”కాని అతను తిరస్కరించాడు. పరిహసిం చాడు. పరలోక జీవితముందని అంగీకరించలేదు. ఆపై సత్య మార్గానికి వ్యతిరేకంగా పన్నాగాలు పన్నటానికి వెళ్ళిపోయాడు”. (ఖియామా) రేపు ప్రళయ దినాన అల్లాహ్‌ ఇదే మనిషినుద్దేశించి (ఇక్కడ ముగ్గురు పండితులున్నారు) –

”ఓ మానవుడా! నేను మీకు ఆరోగ్యవంతమయిన శరీరాన్ని ఇవ్వలేదా! కాని మీరు ఈ శరీరాన్ని నా ప్రసన్నతను బడసే మార్గంలో ఉపయోగించ లేదు” అంటాడు. వారిలో ఒకడికి అప్పుడు గుర్తుకొస్తుంది. తను చేసిన పాపాలన్నిం టిని తలచుకుంటాడు. నీతిని గురించి, న్యాయాన్ని గురించి ఊక దంపుడు ఉపన్యా సాలు ఇచ్చానేగానీ, ఏనాడయినా పిసరంతయినా పాటించిన పాపానికి పోలేదు. నాదంతా వేషధారణ బ్రతుకు. భూ లోకంలోనేగానీ ఇక్కడ అబద్దమాడి తప్పించుకునేందుకు లేదు. సంగీత దర్శకులు, సినీ దర్శకులు, నటులు, నటీమణులు, కలిమి బలిమి గలవాళ్ళెందరో నా వద్దకొచ్చి ఆశీర్వాదం పొంది వెళ్ళే వారు. ఓ మోస్తరు తప్పు చేెసేవారు కూడా నన్ను చూసి వణికిపోయే వారు.  నేను మాత్రం రహస్యంగా పాపాలకు పాల్పడి ఏమీ ఎరుగని వాడిలా నటించేవాడిని. ప్రసంగాల్లో బహుదైవారాధన ఎంత ఘోర మయిన పాపమో శ్రోతల హృదయాలు కంపించిపోయేలా గద్దించే వాడిని. కానీ బహిరంగంగానే దర్గాహ్‌ (సమాధి)పై పీఠాధిపతినయి కూర్చునేవాడిని. ఫాతెహాలు, పది మంది స్త్రీల కహానీలంటూ ప్రజలను భ్రష్టు పట్టించడమే కాక వారి సంపదను కొల్లగొట్టే వాడిని.  భార్యాభర్తలెలా సఖ్యతగా మెలగాలనే విషయంపై ఉద్ధండ ఉపన్యశించి ఇంటి కెళ్ళినప్పటి నుండి భార్యతో తిట్ల తాంబూలాలు, కొట్లాటలు. అతనిప్పుడు రక్త కన్నీరు కారుస్తున్నాడు; కాని ఫలితం లేదు.

మరో మనిషి – తనో మహా సంఘ సేవకుడని, అనాథలకు ఆశ్రయం వంటి వాడని, విధవరాళ్ళును, వయస్సుడిగిన వారికి ఆపద్భాంధవుడి లాంటి దాతని, మహా నేత అని అతన్ని జనాలు పొగిడారు. ఉదయ మొక దేశంలో, మధ్యాహ్నం మరొక దేశంలో, రాత్రి ఇంకొక దేశంలో భోంచేశాడు. విదేశాల్లో కూడా తన వాగ్ధాటికి, పవిత్ర జీవనానికి, వాక్యపరిచర్యకు గులాములయిన వారు కోకొల్లలు. వేల సంఖ్యలో అభి మానులు సభలకు హాజరయ్యేవారు. ఆంగ్లంలో ఏక ధాటిగా ఉపన్యా సాలివ్వడమే కాక, ప్రంముఖులు ఆంగ్లంలో ఇచ్చే ప్రసంగాలకు అను వాదకుడిన వ్యవహరించి ఆయా వ్యక్తుల మన్నలు పొందేవాడు. ఎన్నో ఇళ్ళ స్థలాలు, పొలాలు, పేటకొక భవనం అంతా దేవుని అనుగ్రహం అన్న అతి వినయం ఒకటి.

ఇంకో మనిషి- వర్ణ విభేదాలు, కుల రచ్చలు, జాతి వైషమ్యాలు ఎందుకు చేెసినట్టో? అతని ఇప్పుడే అర్థమయింది. తాను చెడింది గాక ఇతరులెందరినో చెడగొట్టాడు. సృష్టితాలను దైవ స్వరూపాలుగా, దైవాంశ సంభుతులుగా, దైవ అవతరాలుగా చిత్రీకరించి వాటినే పూజి ంచాలని, అదే సనాతన మతం అని మాయమాటలు చెప్పి, అభూత కల్పనలను జోడించి, పుక్కిటి పురాణాలను వ్యాపింపజేసి యుగాల తరబడి మోసగించిన నేరం అతనిది.  రొజుకో బూటకపు దైవాన్ని సృష్టించడం అతనికో ఆట. ఒక దేవునితో బోరు కొడితే వెంటనే మరో దేవుడ్ని ప్రతిష్టింపజేసేవాడు. సింహం, ఏనుగు, శునకం, వరహం కూడా దేవుళ్ళే. అతని వినోదం దేవతను సృష్టించడం. దేవుడొక్కడేనని, ఆయన అద్వితీయుడని,  దేశకాలలకు పరిమితం కానివాడని, అవ్యక్త రూపుడయిన ఆయనను పాంచ భౌతి కారముగా తలంచి పూజించే వారు శుద్ధ అవివేకులని, మానవులంతా ఒక్కటేనేనని,  ఒకే దేవుని దాసులని, నల్లవారికి తెల్లవారిపైగానీ, తెల్ల వారికి నల్లవారిపైగానీ ఎలాంటి ఆధిక్యత లేదు దైవభీతితో తప్ప అని దైవప్రవక్తలు ప్రబోధించినా, దైవగ్రంథాలు ప్రకటించినా అతను లెక్క చేయలేదు.  అతని స్వార్థం, మూర్ఖత్వం, మూడ విశ్వాసాలే నేడు అత నిని భయంకర నరకానికి ఆహుతి చేశాయి. ఇక్కడి నుండి తను వెళ్ళ లేడు. తనలాంటి వారికి ఈ యదార్థాన్ని చెప్పి సంస్కరించాలన్న కోరిక బలంగా ఉన్నా అది సాధ్య పడదు. ఈ విషయం తెలిసిన అతను విలవిల్లాడిపోతూ తన చేతలను కొరుక్కుంటూ: ”అయ్యో! నేను దైవ ప్రవక్తను అనుసరించి ఉంటే ఎంత బాగుండేది! అయ్యో నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయ కుండా ఉంటే ఎంత బాగుండేది! అతని మాయామాటల్లో పడి నేను నా వద్దకు వచ్చిన హితబోధను స్వీకరించలేదే!” (ఫుర్ఖాన్‌: 28,29)అంటూ కుమిలిపోతున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది?  ”సత్యాన్ని తిరస్కరించిన వారు నరకం వైపునకు గుంపులు గుంపులుగా తోలబడతారు. చివరకు వారు అక్కడ చేరిన ప్పుడు దాని ద్వారాలు తెరుచుకుంటాయి”. (జుమర్‌: 71)

నరకం – దానికి ఏడు ద్వారాలు. ”ఆ రోజు నరకం ముందుకు తీసుకు రాబడుతుంది. ఆ దినమున మానవుడు తాను చేసుకున్నదంతా జ్ఞాపకం తెచ్చుకుంటారు”. (ఫజ్ర్‌:23, 24) ”అయ్యో నా కర్మల పత్రం నాకు అసలు ఇవ్వబడకుండా ఉంటే, నా లెక్కే మిటో నాకు అసలు తెలియకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది”. (హాఖ్ఖహ్ :25-27) అని వాపోతాడు. ఏదోక రోజు నేెను చేసిన ప్రతి దానికీ లెక్క చెప్పుకోవాల్సి వస్తుందని నేను ఏ మాత్రం ఆలోచించలేదే! ”అయ్యో! నా ఆ మరణమే అంతిమ మరణ మయి ఉండి ఉంటే ఎంత బావుండేది. నా ఆస్తిపాస్తులు నాకేవిధం గానూ పనికి రాలేదే! నా అధికారమంతా అంతరించి పోయిందే!” (27,28)  అయ్యో నా సైన్యం ఏమయింది? నా ఆజ్ఞను పాలించే వారు ఏమయ్యారు. నా కీర్తికండూతి ఎక్కడా? ఏ ఇంటి నిర్మాణం కోసం పేదల కడుపులు కొట్టానో, ఏ భార్యాపిల్లల కోసం అహిర్నిశలు అవినీతి అక్రమార్కుడిలా వ్యవహరిం చానో, ఏ బూటకపు గౌరవం కోసం అఘాయిత్యాలకు పాల్పడానో వారంరూ ఇప్పుడేమయ్యారు?అని రోధిస్తాడు. కాని అతని రోధన అరణ్య రోధనే అవుతుంది. అల్లాహ్‌ా ఆజ్ఞ జారి చేెయబడుతుంది: ”అతనిని పట్టుకోండి. అతని మెడకు కంఠపాశం తగిలించండి. ఆపైన అతన్ని నరకంలో విసిరి వేయండి. అతన్ని డైభ్బై గజాల పొడుగు గల గొలుసుతో బంధించండి”.          (హాఖ్ఖహ్ :30, 32 )

నిశి రాత్రి, పూర్ణ చంద్రుడు నడినెత్తిన వెలుగుతున్నాడు. స్మశానం నిర్మానుష్యంగా ఉందిగాని నిశ్శబ్దంగానయితే లేదు. కీచురాళ్లు నలుదిక్కుల నుంచీ గీపెడుతున్నాయి. ఒక నల్ల కుక్క వెచ్చని చోటు గా చూసి చుట్ట చుట్టుకుని పడుకుని మధ్య మధ్యలో తల ఎత్తి చంద్రునికేసి మొరచాచి ఏడుస్తోంది. చెట్ల మీద నిద్రపోయే పక్షులు మధ్య మధ్య కదలి రెక్కలు టపటపాలాడించి మళ్ళి జోకొడుతు న్నాయి. స్మశానంలో ఉన్న రాతి, మర్రి వగైరా చెట్ల ఆకుల సందుల నుంచి ఊడల్లాగా జారే చంద్రకిరణాలను చూడండి అదుగో అక్కడ పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తూ ఓ పాడు పడ్డ బంగ్లా. ఒకప్పుడు కళా కాంతులీనిన ఆ ఇల్లు ఇప్పుడెలా ఉందో! అది ఇల్లు కాదు; అదో సమాజం!!

ఈ ఇంట్లో ఒకప్పుడు మనుషులున్నారంటే నమ్మశక్యం కాదు. ఈ బావిలో నీళ్ళు తాగారంటే అవునా అనిపిస్తుంది. ఈ ఇంటి ఆవర ణంలో మానవాళికి పనికొచ్చే పూల చెట్లు, కాయల చెట్లు పెరిగా యంటే కాబోలనుకుంటాము. ఒకప్పుడు అది ప్రకృతి అంతటి నిర్మ లంగా వర్థిల్లిందంటే ఇట్టే నవ్విపోతాము. ఒకప్పుడు ఈ ఇంటిని చూసి మనుషులు గర్వపడేవారు. దీన్ని చూడగానే బలహీన వర్గాల ప్రాణాలు లేచి వచ్చాయి. ఈ ఇంటిని వీడి వెళ్ళాలంటే మనషులు హృదయాలు పుట్టెడు దుఃఖంతో కృంగి పోయేవి అంటే ఏదో కథ చెబుతున్నారనుకుంటారు. అట్టి వైభవంతో అలరారి ఆ ఇల్లు ఇలా కళాహీనంగా మారడానికి కారణం అందులో  నివాసం ఉన్న మను ష్యులే. ప్రస్తుతం ఇక్కడ నివసించే క్రిమికీటకాలు చెయ్యని అత్యాచా రాలు, విరజిమ్మని విషవాయువులు, అడవిలోని మృగాలు సయితం ఎరుగని అఘాయిత్యాలు ఆ ఇంట్లో మనుషులు చేశారు.   ఒకనాటి కాళరాత్రి ఈ వసారాలోనే ఒక అత్త కొడుకులు కలిసి నిండు శూలాలతో ఉన్న కోడలు పిల్లను నిప్పంటి, దాన్నో ప్రమాదం గా చీత్రీకరించి, లేని ప్రేమను నటిస్తూ రోధించి చుట్టప్రక్కల జనాల ఆమోదాన్ని పొందారు. అది జీవితావసరమయిన హత్య కాదు…. నిజం నిప్పులా వారిని వెంటాడింది. హత్య చేసిన ఇద్దరూ ద్వీపాంత రం తరలి వెళ్లి పోయారు. చట్టం నుంచి తప్పించుకున్నామనుకున్నారు.

ఈ ఇల్లు యుద్ధరంగంగా చాలా సార్లే మారింది. ఇక్కడ మను షులు కలిసిమెలిసి బ్రతకలేని పశువులు, కలిసుంటే  సౌఖ్యం, భాగ్యం లభిస్తుందన్న మాటే వారే ఎరుగరు. ఈ ఇంటి ఆవరణంలో చెప్పరాని అత్యాచారాలు జరిగాయి. కొడుకులు భార్యల కొంగున చేరి కన్నవారి మీదే కన్నెర్రజేశారు. వారిని తిరిగిరాని లోకాలకు సాగనంపారు. వారిని అనుమానించారు, వీధిలోకి ఈడ్చి అవమా నించారు. స్టోరు రూములో పెట్టి గొల్ళాలు పెట్టారు. తల్లిదండ్రులని చూడకుండా అమానుషంగా తన్నారు. దిక్కులు పిక్కటిల్లేలా అరచి నా కాపాడే నాధుడే లేక వారు గోడలకు కరచుకొని విలవిల్లాడి పోయారు. ఎముకలు ఉడిగిన దేహాలు…ఎన్ని హింసలని భరి స్తాయి…అలా…అలా…ఒకరోజు వారి ప్రాణాలు గాల్లో కలిసిపో యాయి.

ఈ ఇంటి పడక గదిలో భ్రూణ హత్యలు సయితం చాలానే జరి గాయి. గర్భంతో ఉన్న శిశువు ఆడపిల్ల అని తెలిసి దాన్ని హత మార్చడానికి ఈ ఇంట్లో గూడుపుఠానీలు జరిగాయి. ఒకప్పుడు ‘దేహీ అన్నవారికి నహీ’ అనడం ఎరుగని ఆ ఇంట్లో దమన కాండ లు, దహనకాండలు అనేకమే జరిగాయి. ప్రస్తుతం సజ్జనులయిన వారి పూర్వీకులు స్వర్గ ద్వారాల వద్ద ఉంటే, అప్రయోజకులయిన, అసమర్థులయిన వీరేమో నరక ద్వారానికి సమీపంలో ఉన్నారు. దైవదూతలు ఇలా అడుగుతున్నారు: ”ఎపుడో ఒకప్పుడు మీరు ఈ దినాన్ని కుడా చూడవలసి వస్తుందనీ, మిమ్మల్ని హెచ్చరించిన ప్రవ క్తలు, వక్తలు మీ వద్దకు రాలేదా?”. ‘ఎందుకు రాలేదు? హెచ్చ రించేవాడు వచ్చాడు. కాని మేమే అతన్ని ధిక్కరించాము. ‘అల్లాహ్‌ా దేనినీ అవతరింపజేయలేదు. మీరే అపమార్గానికి గురయి ఉన్నార’ని (అవహేళనగా) అనేశాము” అని వారు (తమ నిర్వాకాన్ని) ఒప్పుకుంటారు”. (ముల్క్‌: 9)  వారు ఇంకా ఇలా అంటారు: ”మేము విని ఉంటే లేదా బుద్ధి పెట్టి ఆలోచించి ఉంటే (ఈ రోజు ఇలా) నరకాగ్నికి ఆహుతి అయిన వాళ్ళతో చేరేవాళ్ళం కాము. ఆ విధంగా వారు తమ తప్పులను (పాపాలను) ఒప్పుకుంటారు. అప్పుడు ‘నరక వాసులు (దైవ కారు ణ్యానికి) దూరమవుగాక!” (అని అనబడుతోంది.)”      (ముల్క్‌: 10, 11)   నరకం-అది చాల భయంకరంగా, అంధకారంగా ఉంటుంది. ”అది కోటవలే పెద్ద పెద్ద నిప్పురవ్వలను విసురుతూంది. (ఆ నిప్పు పగిలి మరిన్ని కణాలను వెదజల్లుతుంది) ఆ రవ్వలు పశుపు పచ్చని ఒంటెలవలే కనిపిస్తాయి”. (ముర్సలాత్‌: 32,33)

”మీకు పూర్వం గతించిన జిన్నాతుల, మానవుల సమూహాలతో చేరి, (వారితోపాటు) మీరు కూడా నరకంలోకి ప్రవేశించండి” అని అల్లాహ్‌ా వారితో అంటాడు. వారిలోని ప్రతి సమూహమూ అందులో (నరకంలో) పడుతున్నప్పుడు, తన సమూహానికి శాప నార్థాలు పెడుతుంది. ఆఖరికి వారంతా అందులో చేరిపోయిన తర్వాత, తరువాతి వారు మొదటివారినుద్దేశించి, ”ఫ్రభూ! మమ్మల్ని అపమార్గం పట్టించిన వాళ్ళు వీళ్ళే. కనుక వీళ్ళకు రెట్టింపు శిక్షను విధించు” అని అంటారు. అప్పుడు అల్లాహ్‌ా ”అందరికీ రెట్టింపు శిక్షే పడుతుంది. కాని ఆ సంగతి మీకు అర్థం కాదు” అంటాడు.  మరియు మొదటి వారు తమ తరు వాతి వారినుద్దేశించి, ”మీకు మాపై ఎలాంటి ఆధిక్యతా లభించ లేదు. కాబట్టి మీరు కూడా మీరు సంపాదించుకున్న దానికి ప్రతిఫలంగా శిక్షను రుచి చూడండి” అంటారు. (ఆరాఫ్‌: 38,39)

ఫలితం తెలిశాక సంజాయిషీలు మొదలయ్యాయి. తమ నాయక మన్యుల,  గురుజనుల తప్పులు అప్పుడు వారి కంటికి కనబడ తాయి. ఈ నాయకాగ్రేసరులు తాము స్వయంగా చెడిపోవడమే గాకుండా తమ అనుచర గణాన్ని కూడా చెడగొట్టారు. కాబట్టి తమ అనుయాయులకన్నా ముందు ‘నాయకులు’ నరకంలో పడ వేయ బడతారు. మధ్యవర్తులుగా వ్యవహరించి నరకం దాటించే స్తారు అన్న భ్రాంతిలో బ్రతికిన జనాలు తమకన్నా ముందు వారిని నరకంలో చూసి ఇలా వాపోతూ: ”మీరే గనక లేకుండా ఉంటే మేము విశ్వాసులయి ఉండే వాళ్లము”. అనంటారు. (సబా: 31)   ”ఏమిటి? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన తర్వాత దాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? వాస్తవంగా మిరంతట మీరే అపరాధానికి ఒడిగట్టారు” అని పెద్దలు బల హీన జనాలకు సమాధానమిస్తారు. (సబా: 32)

మరి (దానికి బదులుగా) ఈ బలహీన ప్రజలు పెద్దవారితో ఇలా అంటారు: ”(లేదు లేదు) రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్ర ఇది! అల్లాహ్‌ాను తిరస్కరించమని, ఆయనకు సహవర్తులు గా ఇతరులను కల్పించంని మీరు జారీ చేెసిన ఆజ్ఞలే మా అవి శ్వాసానికి కారణభూతమయ్యాయి. (నరక) శిక్షను చూడగానే వారంతా లోలోపలే పశ్చాత్తాప పడతారు”. (సబా:33)   తర్వాత ఆ పాలిత జనాలు: ”మా ప్రభూ! మేము మా సర్దారులకు, పెద్ద లకు విధేెయత చూపాము. వాళ్ళే మమ్మల్ని సన్మార్గం నుంచి పెడదారి పట్టించారు. కనుక ఓ అల్లాహ్‌ా! వీళ్ళని రెట్టింపు శిక్ష విధించు. వీళ్లను తీవ్రంగా శపించు” అనంటారు.    (అల్‌ అహ్జాబ్‌: 67,68)

అయితే ఇప్పుడు వారు వగచి లాభం లేదు. ఒకరినొకరు నిందిం చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మేలుకోవలసిన సమయంలో వీరు మేలుకోలేదు. వీరిలో ప్రతి ఒక్కరూ అపరాధే. ఎవరూ తక్కువవేమి తినలేదు. కనుక అందరికి ఏ మోతాదులో దరువు పడాలో ఆ మోతాదులో దరువు పడుతుంది.   ఒండొకరిపై బురదజల్లే ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటూంది. అంతలోనే వారు నరకాగ్ని గురవ్వడానికి అసలు సూత్రధారి అయిన షైతాన్‌ కనబడతాడు. అప్పుడు వారంతా కూడబలుక్కుని తమ పాపాల నిందను అతడిపై వెయ్యలాని ప్రయుత్నిస్తారు. తరు వాత ఏం జరుగుతుంది?  సమస్త వ్యవహారంపై తిర్పు జరిగిపోయిన తరువాత షైతాన్‌ ఇలా అంటాడు: ”అల్లాహ్‌ా మీకు సత్యబద్ధమయిన వాగ్దానం చేశాడు. నేను మాత్రం మీకు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రవర్తిం చాను. నాకు మీపై ఎలాంటి అధికారమూ లేదు. కాకపోతే, నేను మీకు పిలుపునిచ్చాను. మీరు నా మాటను అంగీకరించారు. కాబట్టి మీరు (ఇప్పుడు) నన్ను నిందించకండి; మిమ్మల్ని మీరే నిందించుకోండి. మీ మొరలను నేను ఆలకించలేను. ఇంతకు మునుపు మీరు నన్ను దైవత్వంలో భాగస్థునిగా నిలబెట్టారన్న విషయాన్ని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. నిశ్చయంగా అటు వంటి దుర్మారుగల కోసం వ్యధాభరితమయిన శిక్ష ఉంది”.     (ఇబ్రాహీమ్‌: 22)

సోదరా! సోదరీ! ఆలోచించు….పదే పదే తల దువ్వుకుంటూ అద్దమందు నీ ముద్దుమోముగని మురిసిపోయే వాడివి కదా! ధనాన్ని కూడబెట్టి మాటిమాటికీ లెక్కబెట్టి ఉంచేవాడివి నీవే కదా! నీ ధనం, నీ అందం నీకు ఏ విధంగాను పనికి రాదు. ఐహిక సకల భోగభాగ్యాలను అనుభవించిన ఓ మనిషీ! ఈ రోజు నరక వాసుల తొడిగే దుస్తులు, తీసుకునే ఆహారం ఎలా ఉంటుందో ఒక్కసారయినా ఆలోచించావా? వారు ఎక్కడ విశ్రాంతి తిసుకుం టారో, ఎక్కడ నిద్రిస్తారో? వారికి లభించే నీడ ఎటువంటిదో ఒక్క క్షణమయినా ఊహించావా? నా మాటలకేం గానీ, అల్లాహ్‌ా మాట ల్లోనే వారి అవస్థ గురించి తెలుసుకో!

”వారి కొరకు అగ్గి వస్త్రాలు కత్తిరించబడి ఉంటాయి”.    ప్రపం చంలో ఉన్న అగ్ని నరకాగ్ని యొక్క 70వ భాగమని ప్రవక్త (స) సెలవిచ్చి ఉన్నారు. ఇహలోకాగ్నియే ఇంత దారుణంగా ఉంటే, ఇక నరకాగ్ని ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ”వారికి నరకాగ్నే పాన్పు, నరకాగ్నే దుప్పటి”. అంటే వారు నర కాగ్నినే దుస్తులుగా ధరిస్తారు. నరకాగ్నిపైనే నిద్రిస్తారు. నరక నిప్పునే దుప్పటిగా కప్పుకుంటారు. మరి వారి కోసం నీడ ఉండదా? అంటే, ఉంటుంది-వారి మీద నిప్పు నీడవలే పైనుండి, క్రింద నుండి కూడా క్రమ్ముకుని ఉంటుంది. ముందు నుండి, అగ్ని, వెనుక నుండి అగ్ని, కుడివైపు నుండి అగ్ని, ఎడమ వైపు నుండి అగ్ని, ఎటు చూస్తే అటు అగ్నే అగ్ని  కురుస్తూ ఉంటుంది. ఆ రోజు చోటు చేెసుకునే ఈ పర్యవసానం గురించే అల్లాహ్‌ా తన దాసులను హెచ్చరిస్తున్నాడు: ”వాటి యాతన గురించి అల్లాహ్‌ాతన దాసులకు భయపెడుతున్నాడు. ఓ నా దాసులారా! అందుకే నా పట్ల భయం భక్తులు కిలిగి ఉండండి”. (జుమర్‌:16)

 

Related Post