
”జాగ్రత్త! మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల, సజ్జనుల సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు. మీరు మాత్రం అలాంటి చేష్టలకు ఒడిగట్టకండి అని నేను మీకు తాకీదు చేస్తున్నాను”.
సందేహం: ఇంతకీ మహాప్రవక్త (సఅసం) వారి సమాధిని మస్జిదె నబవీ లోపలికి తీసుకోవటంలోని ఆంతర్యం ఏమిటి?
సమాధానం: ”యూదులపై, క్రైస్తవులపై అల్లాహ్ శాపం పడుగాక! ఎందుకంటే వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిద్ (సాష్టాంగ ప్రణామ స్థలం) గా చేసుకున్నారు” అని మహాప్రవక్త (సఅసం) ప్రవ చించారు (బుఖారీ, ముస్లిం).
వేరొక హదీసు ద్వారా కూడా రూఢీ అయ్యేదేమిటంటే హజ్రత్ ఆయిషా (ర.అన్హా) కథనానుసారం – ఉమ్మె సలమా, ఉమ్మె హబీబాలిద్దరూ (ర.అన్ హుమా) దైవప్రవక్త (స) దగ్గర ఒక చర్చీ గురించి ప్రస్తావించారు. ఆ చర్చీలో చిత్ర పటాలు, విగ్రహాలు ప్రతిష్ఠించి ఉండటం తాము చూశామని వారు చెప్పగా, ఆయన (సఅసం) ఇలా అన్నారు; ”వారు (గ్రంథంగల ప్రజలు) తమలోని పుణ్య పురుషులు చనిపోయినప్పుడు వారి సమాధులపై ఆరాధనాల యాన్ని నిర్మించి, వాటిలో వారి చిత్రపటాలను ఆవిష్కరించేవారు. అల్లాహ్ా దృష్టిలో అత్యంత నికృష్ట జనులు వీరే”. (బుఖారీ, ముస్లిం).
ఇంకొక హదీసు –
ఇమామ్ ముస్లిం (రహ్మ.లై) గారు తన సహీహ్ా ముస్లింలో హజ్రత్ జున్దుబ్ బిన్ అబ్దుల్లాహ్ (రజి) ఉల్లేఖనాన్ని పొందుపరిచారు. దాని ప్రకారం ఆయనిలా అన్నారు: దైవ ప్రవక్త (సఅసం) చెప్పగా నేను విన్నాను – ”జాగ్రత్త! మీకు పూర్వం గతించినవారు తమ ప్రవక్తల, సజ్జనుల సమాధులను ఆరాధనా స్థలాలుగా చేసుకునేవారు. మీరు మాత్రం అలాంటి చేష్టలకు ఒడిగట్టకండి అని నేను మీకు తాకీదు చేస్తున్నాను”.
హజ్రత్ జాబిర్ (రజి) ఉల్లేఖనం ప్రకారం ”మహనీయ ముహమ్మద్ (సఅసం) వారు సమాధులను పటిష్ట పరచటాన్ని, వాటిపై కూర్చోవటాన్ని, వాటిపై నిర్మాణాలు చేపట్టడాన్ని వారించారు”.(ముస్లిం)
పైన పేర్కొనబడిన ప్రామాణిక హదీసులను బట్టి ఎట్టి పరిస్థితిలోనూ సమాధులను ‘సజ్దా’ స్థలాలుగా చేసుకోరాదని స్పష్టంగా విదిత మవుతోంది. అలాగే గోరీలపై నిర్మాణం చేయటం, గుంబదులు వంటివి కట్టడం కూడా అధర్మమే. ఎందుకంటే ఇవన్నీ ప్రజలను దేవుని ఏక త్వం నుండి దూరం చేసి, షిర్క్ (బహుదైవోపాసన) కు మార్గం తెరు స్తాయి.
ఇక ప్రవక్త (సఅసం) సమాధిని మస్జిద్ లోపలికి తీసుకోవటం గురించి చెప్పుకుందాం –
దైవప్రవక్త (సఅసం) గానీ, ఆయన గారి ఇద్దరు ప్రియ సహచరులు (అబూబక్ర్, ఉమర్) గానీ వాస్తవానికి మస్జిద్ లోపలి భాగంలో ఖననం చేయబడలేదు. నిజానికి వారు ముగ్గురూ హజ్రత్ ఆయిషా (ర.అన్హా) నివసించే కుటీరంలో ఖననం చేయబడ్డారు. అయితే మస్జిద్కు వచ్చేవారి సంఖ్య ఏటేటా పెరుగుతుండటం వల్ల వలీద్ బిన్ అబ్దుల్ మలిక్ కాలంలో మస్జిదె నబవీ విస్తృతి జరిగింది. ఆ సందర్భంగా – హి. మొదటి శతాబ్ది చివర్లో – హజ్రత్ ఆయిషా (ర.అన్హా) గారి కుటీరం కూడా మస్జిద్లో విలీనం చేసుకోబడింది.
తత్కారణంగా దైవ ప్రవక్త (సఅసం) సమాధితోపాటు, ప్రియ సహచరులిద్దరి సమాధులు కూడా ఆ విలీన స్థలంలో అంతర్లీనమై నాయి. కాబట్టి ఇది మస్జిద్లోపల జరిగిన ఖనన సంస్కారం అని చెప్పటం సరైనది కాదు. ( – షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ – రహ్మ)
ఫోన్లో ‘మైనె ఖుబూల్ కియా’ అంటే సరిపోతుందా?