స్వచ్ఛ భారతం-స్వేచ్ఛా భారతం

తమ ఇంట సమస్త పారిశుద్ధ్యపు నియమాలు పాటిస్తే, తమ కుటుం బానికి మహమ్మారి సోకదని, తమ ఇంటిని కాపాడుకుంటే, వీధిలో వ్యాపిస్తున్న మంటల నుండి తప్పించుకోవచ్చని భ్రమకు లోను కావ డం మూర్ఖత్వమే అవుతుంది.

తమ ఇంట సమస్త పారిశుద్ధ్యపు నియమాలు పాటిస్తే, తమ కుటుం బానికి మహమ్మారి సోకదని, తమ ఇంటిని కాపాడుకుంటే, వీధిలో వ్యాపిస్తున్న మంటల నుండి తప్పించుకోవచ్చని భ్రమకు లోను కావ డం మూర్ఖత్వమే అవుతుంది.

భారత దేశం ఓ ‘పెద్ద ఓడ’ అయితే భారతీయులంతా అందులోని ప్రయాణీకులు. మన ప్రయాణం సుఖంగా ముందుకు సాగాలంటే, సురక్షితంగా మనం గమ్యం చేరుకోవాలంటే అందరూ కొన్ని నిబంధ నల్ని పాటించాలి. నౌకా సిబ్బంధికి, ప్రయాణీకులకు మధ్య సదవగా హన, సహకారభావన ఉండాలి. ఏ ఒక్కరు మూర్ఖత్వంతో నిబంధనల్ని ఉల్లంఘించినా, బాధ్యతారాహిత్యంగా ఓడను గుల్ల చేసినా, గుల్ల చేస్తున్న వారిని పల్లెత్తుమాట అనకుండా, వారిని ఆపక పోయినా పరి ణామం భయంకరంగా ఉంటుంది. ‘హమ్‌తో డూబే హైఁ సనమ్‌, తుమ్‌కో భీ లే డూబేఁగే’ అన్నట్టు వారితోపాటు అందరూ మునగడం ఖాయం! .
సోదర సోదరీమణులారా! ఈ ఉపమానాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ పరిస్థితులను గమనించండి.ఒకవైపు దుర్మార్గులు, నేరస్థులు, అధికార పిపాసులు, అక్రమార్కులు, అవినీతి ధురంధరులు, కులతత్వాన్ని, మత తత్వాన్ని రెచ్చగొట్టేవారు, అధికార దుర్వినియోగం ద్వారా ధనార్జనకు పాల్పడేవారు, ప్రజల హక్కుల్ని కాలరాసేవారు, బలహీనుల్ని అంగ బలం, అండబలం, ధనబలంతో,అణగద్రొక్కే వారు, జూదరులు, వ్యభి చారులు, త్రాగుబోతులు, సమాజాన్ని లోలోనే గుల్ల చేస్తున్నారు. ఫలి తంగా దుర్మార్గం, దౌర్జన్యం, అత్యాచారాలు, అక్రమాలు, లంచగొండి తనం, పీడన పెచ్చరిల్లి మానవత వీధి వీధినా విలవిల్లాడుతూ. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
మరోవైపు సజ్జనులుగా, సదాచారులుగా, సద్వర్తనులుగా ధర్మకర్తలు గా, ధార్మిక పండితులుగా, ఆధ్యాత్మిక గురువులుగా, శాంతిదూతలు గా, ధర్మపరాయణులుగా, దైవభక్తులుగా దేశాభిమానులుగా పరిగణిం చబడే వారు-తమ కళ్ళెదుటే నేరాలు, ఘోరాలు జరుగుతున్నా ప్రేమో న్మాదులు జాతి ఆడపడచులపై యాసీడ్‌ దాడులు చేస్తున్నా కామాం ధులు అమ్మాయిలపై పైశాచికంగా విరుచుకుపడుతున్నా ప్రజల సమస్యల్ని ఎన్నడూ ప్టించుకోని ప్రజాప్ర తినిధులు, అధికార పిపా సులు, స్వార్థపరులు, పరాన్నజీవులు స్వల్ప ప్రయోజనాల కోసం, ఓటు కోసం, సీటు కోసం నోటుతో, మద్యంతో ఆత్మగౌరవాన్ని కొంటున్నా, సమాజంలో కులతత్వాన్ని, మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఒక వర్గం మరొక వర్గంపై దాడులు చేస్తున్నా, మారణ హోమాన్ని రగిలింస్తున్నా, యువతీ యువకులు పాశ్యాత్య నాగరికతకు బానిసలై స్వేచ్ఛ పేరుతో, ప్రేమ పేరుతో కుటుంబ గౌరవాన్ని మంటగలుపుతున్నా, యువత మద్యం, మాదకద్రవ్యాలకు, అక్రమ సంబంధాలకు దాసోహమంటూ తమ బ్రతుకుల్ని, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నా, జాతి కూతుళ్ళు వరకట్న కాళనాగుల కాటుకు బలైపోతున్నా సభ్యసమాజం సిగ్గుపడే విధంగా వారాంతపు కాలక్షేపం పేరిట యువతీయువకులు లైంగిక విశృంఖలత్వానికి బానిసలై ఎయిడ్స్‌ మహమ్మారిని బలపరు స్తున్నా – తమకు ఏమీ పట్టనట్లు, తమకెలాంటి సంబంధం లేనట్టు వ్యవహరిస్తే వారి పరోక్షంగా నేరాలను, నేరస్తులను ప్రోత్సహిస్తునట్లే! అపరాధం చేసిన వారితోపాటు అపరాధాన్ని సహించి నిర్లిప్తంగా ఉండేవారు కూడా నైతికంగా ధర్మం దృష్టిలో నేరస్తులే, శిక్షార్హులే!

తమ ఇంట సమస్త పారిశుద్ధ్యపు నియమాలు పాటిస్తే, తమ కుటుం బానికి మహమ్మారి సోకదని, తమ ఇంటిని కాపాడుకుంటే, వీధిలో వ్యాపిస్తున్న మంటల నుండి తప్పించుకోవచ్చని భ్రమకు లోను కావ డం మూర్ఖత్వమే అవుతుంది. తమతోపాటు తమ పరిసరాలను చక్క బరచడం, చెడును నిరోధించడానికి నడుం కట్టుకోవడం జరగకపోతే వచ్చే మహమ్మారి అయినా, అగ్నికీలలైనా మనల్ని దయతలచి వదిలి పెట్టవని గుర్తించాలి.ఈ నేపథ్యంలోనే విశ్వప్రభువైన అల్లాహ్‌ా సెలవి స్తున్నాడు: ”(జనులారా!) రానున్న ఆపద నుండి రక్షించుకోండి. దాని విపత్తు కేవలం మీలో అపరాధులయిన వారి వరకే పరిమితం కాదు. తెలుసుకోండి! అల్లాహ్‌ కఠినంగా శిక్షించేవాడు”. (దివ్యఖుర్‌ఆన్‌:8:25)
భిన్న సంస్కృతులకు కేంద్రంగా ఉన్న భారత దేశంలో ఒకరి వాదన లో, విధానంలో మరొకరికి ఏదోక లోటు కన్పిస్తూనే ఉంటుంది. నాస్తికునికి ఆస్తికవాదం, ధనికునికి కమ్యూనిజం, పొలిటిషన్‌కి విప్లవ నినాదం, లంచగొండికి నిజాయితీ నినాదం కంపరం కలిగిస్తాయి. వాదం,విధానం ఏదయినా,అవతలి వారిలో స్పష్టంగా తప్పు కనబడు తున్నా నొప్పించకుండా వారి తప్పుపను తెలియజేయడం, ఏ ఒక్క రికి హాని కలుజేయకుండా ఆపడం, మనం సయితం ఏ ముసుగూ లేకుండా బ్రతకడం ఉత్తమం.
ఈ నిమిత్తం. సజ్జనులు, శ్రేయోభిలాషులు,మంచిని ప్రేమించేవారు, తమ వీధి నుంచే, తమ పేట నుంచే మంచిని, మానత్వాన్ని, మత సామరస్యాన్ని, పరిశుద్ధతను పెంపొదించేందుకు నడుం బిగించి ముందుకు వచ్చినప్పుడే స్వచ్ఛ భారతం-స్వేచ్ఛా భారతం సాధ్యమవు తుంది.

Related Post