
ప్రతి మనిషి సహజంగా సౌభాగ్యవంతమయిన జీవితాన్నే కాంక్షి స్తాడు. అతని జీవితం సంతోషాల పచ్చ తోరణాలతో కళకళలాడాలనే కోరుకుంటాడు. ఆ విషయమయి మహనీయ ముహమ్మద్ (స) వారి దీవెనల్ని పొందాలని మనలో ఎవరికుండదు చెప్పండి! ఆయన అన్నారు: ”నా నుండి ఓ మాట విని దాన్ని స్వయంగా ఆచరించి, యాథావిథిగా ఇతరుల వరకు చేరవేసిన వ్యక్తిని అల్లాహ్ా సుభిక్షంగా ఉంచుగాక!” (తిర్మిజీ)
మనకు మన జీవితంలో సిసలయిన సంతోషం ఎప్పుడు ప్రాప్తమవు తుందో తెలుసా? ఎప్పుడయితే మనం సాటి ప్రజల కోసం పాటు పడతామో అప్పుడు, ఎప్పుడయితే మనం కేవలం అల్లాహ్ా ప్రీతిని కోరుతూ బడుగు, బలహీన ప్రజల పట్ల, అభాగ్యుల పట్ల, అనాథల పట్ల, వితంతువుల పట్ల, వికలాంగుల పట్ల దయ, జాలి, కరుణ కలిగి వ్యవహరిస్తామో అప్పుడు. మనిషి సాటి మనిషికి చేసుకునే సేవల్లో అగ్ర భాగానికి చెందిన సేవ మార్గం మరచి, గమ్యం ఏదో తెలియక, ఏ పిలుపు వినాలో, ఏ తలుపు తట్టాలో తెలియక తికమత పడే వారికి సరైన మార్గం వైపునకు, సిసలయిన గమ్యం వైపునకు మార్గదర్శకం వహించడం. ఈ బృహత్తర లక్ష్యంతోనే ఐపిసి స్థాపన అమల్లోకి వచ్చింది.
మానవత ధర్మమయిన ఇస్లాంను సమస్త మానవాళికి చేరవేయాలని, కాంతి కానరాక మిథ్యా మబ్బుల్లో, పైత్యం పబ్బుల్లో కొట్టుమిట్టాడే వారికి సత్యం అన్న పత్యం ఇచ్చి వారి జీవితాల్లో ధర్మ దీపాల్ని వెలిగిం చాలని, సత్యబద్ధ్దమయిన ఇస్లామీయ సమాజంలో వారు శ్వాసించేలా వారికి తర్పీదు ఇవ్వాలన్న సదుద్దేశంతో 1978లో ఐపిసి స్థాపన జరి గింది. నాడు ఓ చిన్న గదిలో కొందరు యువకుల ప్రయత్నంగా మొగ్గ తొడిగిన ఈ ఆలోచన మహా వృక్ష సృజనకు దారి తీసింది. దాదాపు 35 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ ఫలితంగా నేడు అది శాఖోపశాఖలుగా విస్తరించి 14 భాషల్లో ధార్మిక సేవల్ని అందిస్తోంది. 9 భాషల్లో పత్రికల్ని ప్రచురిస్తోంది.
కువైట్ జీవధాత్రిపై నేడు మనం చూస్తున్న సామాజిక, ఆధ్యాత్మిక సేవలు ఏవయితే ఉన్నాయో అవన్నీ అల్లాహ్ా కృపా కటాక్షాల తర్వాత ఇక్కడి సత్పౌరుల, సజ్జనుల, సుగుణవమతుల, సుమతుల సహాయం తోనే అని మనం గమనించాలి. ఈ రోజు ఓ విదేశి గడ్డపై అచ్చ తెలుగు అచ్చవుతున్న నెలవంక పత్రిక వారి సహకారంతోనే సాధ్యమ యింది. సత్కార్యాల సుమ వనంలా వర్థిల్లుతున్న కువైట్ నగరం కల కాలం కళకళలాడుతుండాలని, ప్రతి కీడు నుండి అల్లాహ్ా ఈ దేశాన్ని కాపాడాలని, ప్రపంచ దేశాలన్నింటిని సంక్షేమ బాటన నడిపించి, రక్షించాలని మనసారా దయాసాగరుడయిన అల్లాహ్ాను దీనాతిదీనంగా వేడుకుందాం!
నిరంతర సమర క్షేత్రంజీవితం. మనిషి కళ్ళు తెరవగానే ప్రారంభమవు తుంది. మళ్ళి కళ్ళు పూర్తిగా మూతబడేంత వరకూ సాగుతుంది. ఈ మధ్య కాలంలో మనిషి తన చర్మ చక్షువులతోపాటు అంతర్ చక్షువు ల్ని సయితం తెరవగలగే క్షణం మహత్తరమయినది. అది జీవన సంగ్రా మానికి శంఖారావం. సంపూర్ణ సంరంభానికి ప్రారంభం. అటువంటి శుభ గఢియలు ఒకరి జీవితంలో చోటు చేెసుకునేందుకు మనం కారకు లవ్వడం ఎంత భాగ్యంతో కూడుకున్న విషయమో ఆలోచించండి! ఈ నేపథ్యంలో మహనీయ ముహమ్మద్ (స)వారు హజ్రత్ అలీ (ర) గారిని ఖైబర్ సంగ్రమానికి సాగనంపుతూ యుద్దం కన్నా గొప్ప కార్యం అని చెప్పిన మాట గమనార్హం. ”నీ మాధ్యంగా ఒక వ్యక్తిని అల్లాహ్ా సన్మా ర్గాన్ని చూపితే అది నీ పాలిట (అరబ్బుల దగ్గర)అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ఎర్ర ఒంటెల్ని పొందడం కన్నా ఎంతో ఘనతరమయినది”. (బుఖారీ) మరో ఉల్లేఖనంలో: ”అది ప్రపంచ సకల సంపదలకంటే శ్రేష్ఠతరమ యినది” అని ఉంది. (బుఖారీ)
మనం పైన తెలుసుకున్నట్ల కొంత మంది యువకుల శ్రమ ఫలితం నేటి ఐపిసి. అంటే యువకులు ఓ కార్యానికి పూనుకుంటే ఎంతటి సత్ఫ లితం చోటు చేసుకుందో చూస్తున్నాము. కాబట్టి మనందరిపై, ముఖ్యం గా ముస్లిం యవతపై ఈ బాధ్యత మరింత అధికంగా ఉంటుంది. మన లో చాలా మందికి తమ నడకలో,నడవడికలో మిస్టర్ ఫర్ఫెక్ట్ అన్పించు కోవాలని ఉంటుంది. మరి మనలో మిస్టర్ ఫర్ఫెక్ట్ ఎవరో తెలుసా? ‘ఎవరయితే తన స్వయాన్ని అంచనా వేయగలిగే స్థాయికి చేరుకుని, మరణానంతర జీవితం కోసం ఇహలోకంలోనే సత్కర్మల సామగ్రిని సమ కూర్చుకుంటాడో వాడే మిస్టర్ ఫర్ఫెక్ట్’. మనిషికి ఈ స్థాయికి చేరు కోవాలంటే ‘తానేమో, తన పనేమో, ఒకరి మంచిలోకి రాడు, ఒకరి చెబ్బరలోకి పోడు’ అన్నట్టు ఉంటే కుదరదు. అందరితో కలిసి ఉండాలి. అందరి క్షేమాన్ని, శ్రేయాన్ని కోరుకోవాలి. ప్రవక్త మహనీయ ముహమ్మద్ (స) ఇలా ఉపదేశించారు: ”ఏ ముస్లిం అయితే జనులతో కలుగోలుగా, కలివిడిగా ఉంటాడో, ఇంకా వారి వల్ల ఏదయినా బాధ కలిగినప్పుడు సహనం వహిస్తాడో అతను,జనులకు దూరంగా ఉంటూ, వారి ద్వారా కలిగే బాధని ఓర్చుకునే అవకాశం లేని ముస్లింకన్నా ఉత్తముడు” (తిర్మిజీ, మిష్కాత్)
ప్రతి మనిషి సహజంగా సౌభాగ్యవంతమయిన జీవితాన్నే కాంక్షి స్తాడు. అతని జీవితం సంతోషాల పచ్చ తోరణాలతో కళకళలాడాలనే కోరుకుంటాడు. ఆ విషయమయి మహనీయ ముహమ్మద్ (స) వారి దీవెనల్ని పొందాలని మనలో ఎవరికుండదు చెప్పండి! ఆయన అన్నారు: ”నా నుండి ఓ మాట విని దాన్ని స్వయంగా ఆచరించి, యాథావిథిగా ఇతరుల వరకు చేరవేసిన వ్యక్తిని అల్లాహ్ా సుభిక్షంగా ఉంచుగాక!” (తిర్మిజీ)
మనం ఆయన చెప్పిన మాటకు అక్షర రూపం ఇవ్వాలంటే దాని కోసం మనం పండితులమో,పెద్ద హోదా గలవారమో, పేరు ప్రఖ్యాతలు గల వ్యక్తులమో, గొప్ప వక్తలమో కానవసరం లేదు. మనం ఎవరమ యినా, ఏ స్థాయి, హోదాకు చెందిన వారమయినా మనం మన ధర్మాని కి ఏం చేశాము, ఏం చెయగలము? అన్న ఆత్మ సమీక్షతో ముందుకు సాగిన నాడు,పుచ్చికోడంలో కాదు ఇవ్వడంలో ఆత్మానందం దాగుందని గ్రహించిన నాడు మన భాగ్య జీవితానికి బాట, పూబాట పడుతుంది.
మనలోని ప్రతి వ్యక్తి ఏదోక విధంగా ఇతరుల్ని ప్రభావితం చేస్తున్నాడు. ఇతరుల వల్ల ఏదోక విధంగా ప్రభా వితం అవుతున్నాడు. వక్తలు, రచయితలు, నాయకులు, పండితులు మాత్రమే ఇతరుల్ని ప్రభావితం చెయ్యగలరు అన్నది ఒక అపోహ తప్ప మరేమీ కాదు. వ్యక్తి ఎవర యినా తన మాట ద్వారా, తన ప్రవర్తన ద్వారా ఇతరుల్ని ప్రభావితం చెయ్యగలడు. ఇతరుల్ని ఇట్టే ఆకట్టుకో గలడు. అంటే మన మంచి ప్రవర్తన మంచి ప్రభావాన్ని చూసిపతే, చెడ్డ ప్రవర్తను చెడు ప్రభావానికి కారణం అవుతుంది.
మనం మన ధర్మ సేవ ఎంత చేశామన్నది కాదు ముఖ్యం. ఎంత నాణ్యతతో చేశాము. ఎంత చిత్తశుద్ధితో చేశామన్నది ముఖ్యం. దైవప్రవక్త (స) ఒక్కో వ్యక్తి దగ్గరకు 70 సార్లకన్నా ఎక్కువ వెళ్ళేవారు అంటే, ఈ బృహత్కార్య నిర్వహణ ఫలితంగానే కొందరు ప్రవక్తలు అన్యాయంగా చంప బడ్డారు, కొందరు ప్రవక్తల్ని రంపంతో రెండుగా చీరేశారు, కొందరు ప్రవక్తలు నిప్పుల్లో నెట్ట బడ్డారు, కొందరు దూషించబడ్డారు, కొందరు చిత్రహింసలకు గురి చేయబడ్డారు అంటే మానవాళిని మాధవుని దరికి చేర్చడం, వారిని నరకాగ్ని నుండి కాపాడటం ఎంత ఘనతర కార్యమో అర్థం అవుతుంది.
కువైట్లో నివసించే అరబీ యువకుడు, గోవా రాష్ట్రానికి చెందిన అహ్మద్ లూసీ అనే తన రూమ్మెట్ని ఎప్పుడూ ప్రేమతో పలుకరించే వాడు. అయితే అతను ముస్లిం అవ్వడం చేత ఆ వ్యక్తి అంతగా పట్టిం చుకునే వాడు కాదు. ఇస్లాం గురించి ఏదయినా చెప్పాలన్నా వినేవాడు కాదు. ఓ రోజు ఐపిసి నుండి ఓ గిఫ్ట్ ప్యాక్ తీసుకెళ్ళి అతనికిచ్చాడు. అతను తీసుకోవడానికయితే తీసుకున్నాడు కానీ, తర్వాత దాన్ని చెత్తకుండి పడేశాడు. అలా అనేక సార్లు జరిగింది. అయినా ముస్లిం సోదరుడు తన ప్రయత్నాన్ని మానుకోలేదు. చివరికి ఓ రోజు ఆ వ్యక్తి ఆలోచించాడు- ఇంతలా నేను అసహ్యించుకుంటున్నా, కాదంటున్నా తనెందుకు అంతలా నన్ను బతిమాలుతున్నాడు. ఆ పుస్తకాలలో ఏముందో చదివితే పోలా, అని అంతకు క్రితమే చెత్తకుండి లో పడేసి ఓ పుస్తకాన్ని తీసుకొని చదవనారంభించాడు. అల్హమ్దు లిల్లాహ్ా తర్వాత పుస్తకాలన్నీ తిరగేసిన అతను ఇస్లాం స్వీకరించాడు.
ఇలా ఎవరు ఎవరి ఇస్లాం స్వీకరణకు కారకులవుతారో మనకు తెలియదు.ఆ విషయానికొస్తే నేడు పండితాగ్రేసర స్థాయిని అధిరో హించి, హదీసు పుస్తకాన్ని 20 సంపుటాల్లో రచించిన మౌలానా జియావుర్రహ్మాన్ ఆజమీ-ఒకప్పుడు ముస్లిం కాదు. అయితే తెలుగులో ‘ఇదియే ఇస్లాం’ అన్న మౌలానా అబుల్ ఆలా మౌదూదీ (ర) గారి పుస్తకం ఆయన జీవితాన్నే మార్చి వేసింది. ఆ పుస్తకాన్ని ఆయన హిందీలో చదివారు. ఆ పుస్తకాన్ని ఆయనకెవరిచ్చారో అతని పేరు కూడా ఆయనకు గుర్తు లేదు కానీ నేటికీ ఆయన ఆ వ్యక్తి గుర్తు చేసు కుంటూనే, మనస్ఫూర్తిగా దీవిస్తూనే ఉం టారు.
అలాగే డి.ఎమ్.కె వంటి నాస్తిక భావజాలం మీద ఆధార పడిన రాజకీయ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించిన ఒక ప్రసిద్ద తమిళ పాత్రికే యుడు అడియార్ ఎలా ఇస్లాం స్వీకరించారనుకుంటున్నారు? ఆయన అనారోగ్యానికి గురయి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన అనుమతి మేరకు అందరూ అన్ని మత గ్రంథాలను ఆయనకందిం చారు. వాటన్నింటిని చదివిన ఆయన సత్య ధర్మం ఇస్లాం మాత్రమే అన్న నిర్ణయానికి రావడమే కాకుండా ‘నిరోట్టం’ అనే దిన పత్రికలో ఇస్లాం ధర్మానికి సంబంధించి వ్యాస పరంపరను వ్రాసారు. చివరకు ఇస్లాం స్వీకరించి తన పేరు అబ్దుల్లాహ్గా మార్చుకున్నారు.
చూశారా! ఇదంతా ఇటువంటి గిఫ్ట్ ప్యాక్ మాధ్యమంగానే జరిగింది. కనుక మనం సయితం ఐపిసిని సంప్రదించి ఈ బృహత్కార్యంలో భాగస్తులవుదాం. అల్లాహ్ా దాసుల వరకు అల్లాహ్ా అంతిమ సందేశాన్ని చేరవేద్దాం!
Arabic
English
Spanish
Russian
Romanian
Hindi
Tagalog
Bengali
Sinhalese
Nepali
